తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Yash And Suriya For Rc15 Event: ఆర్సీ15 టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు యశ్, సూర్య!

Yash and Suriya for RC15 Event: ఆర్సీ15 టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు యశ్, సూర్య!

HT Telugu Desk HT Telugu

31 October 2022, 16:51 IST

    • Yash and Suriya for RC15 Event: ఆర్సీ15 టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు యశ్‌, సూర్య రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి రేపుతోంది.
కియారా అద్వానీ, రామ్ చరణ్
కియారా అద్వానీ, రామ్ చరణ్

కియారా అద్వానీ, రామ్ చరణ్

Yash and Suriya for RC15 Event: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, లెజెండరీ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్‌ ఆర్సీ15. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ తర్వాత మళ్లీ ఎంతో ఆసక్తి రేపుతున్న చరణ్‌ మూవీ ఇది. దిల్‌రాజు ప్రొడ్యూస్‌ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి పూర్తిగా పట్టాలెక్కలేదు. అదే సమయంలో ఇండియన్ 2 మూవీని కూడా శంకర్‌ తెరకెక్కిస్తుండటంతో ఆర్సీ15 కాస్త నెమ్మదిగా సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

ఇప్పటికే కొన్ని కీలకమైన షెడ్యూళ్లను ఈ మూవీ పూర్తి చేసుకుంది. అటు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు కూడా విజయ్‌తో తెరకెక్కిస్తున్న వారసుడు మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దిల్‌ రాజు పూర్తి వారసుడు ప్రమోషన్లపైనే దృష్టి సారించనున్నాడు.

ఆ తర్వాత ఆర్సీ15 జోరందుకోనుంది. ఇక ఈ మూవీ టైటిల్‌ లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వారసుడు మూవీ రిలీజ్‌ తర్వాత ఈ టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్ జరగనుంది. తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌కు కన్నడ, తమిళ సూపర్‌స్టార్లు యశ్‌, సూర్య హాజరుకానున్నారు.

ఈ ఈవెంట్ హైదరాబాద్‌ లేదా ముంబైలలో జరిగే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌కు ఈ ఇద్దరు హీరోలతోపాటు మరికొందరు స్టార్లు కూడా రానున్నారు. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ కూడా రిలీజ్‌ కాకపోయినా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‌ హక్కులను రూ.15 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. దానిని బట్టి తెలుగు రాష్ట్రాలు, పాన్‌ ఇండియాలో ఇంకా ఏ లెవల్లో బిజినెస్‌ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఆర్సీ15లో రామ్‌చరణ్‌ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఇంకా నిర్ణయించలేదు. అయితే వచ్చే ఏడాది సమ్మర్‌ లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌ చేయాలని చూస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం