తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda Rashmika Maldives Tour: విజ‌య్ ర‌ష్మిక మాల్దీవులు టూర్‌ - ఎయిర్‌పోర్ట్ ఫొటోలు వైర‌ల్‌

Vijay Deverakonda Rashmika Maldives Tour: విజ‌య్ ర‌ష్మిక మాల్దీవులు టూర్‌ - ఎయిర్‌పోర్ట్ ఫొటోలు వైర‌ల్‌

07 October 2022, 12:11 IST

  • Vijay Deverakonda Rashmika Maldives Tour: విజ‌య్ దేవ‌ర‌కొండ,  ర‌ష్మిక మంద‌న్న జంట‌గా విహార‌యాత్ర కోసం విదేశాల‌కు వెళ్లిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. శుక్ర‌వారం వీరిద్ద‌రు ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో క‌నిపించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న్న
విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న్న (Twitter)

విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న్న

Vijay Deverakonda Rashmika Maldives Tour: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రేమ వార్త‌ల‌పై విజ‌య్‌, ర‌ష్మిక ఇప్ప‌టివ‌ర‌కు పెద‌వి విప్ప‌లేదు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో తెలుగులో గీతాగోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా షూటింగ్స్ లోనే విజ‌య్‌తో ర‌ష్మిక ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లుగా స‌మాచారం.

ట్రెండింగ్ వార్తలు

Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు మరో అంతర్జాతీయ వేదికపై అవార్డుల పంట.. ఆరు పురస్కారాలు: ఏఏ విభాగాల్లో వచ్చాయంటే..

Samantha: ‘అది ఫేక్’: సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సమంత ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..

Chitram Choodara OTT: నేరుగా ఓటీటీలోకి వస్తున్న వరుణ్ సందేశ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

విజ‌య్ ఫ్యామిలీ ఫంక్ష‌న్స్‌లో ర‌ష్మిక క‌నిపించ‌డం, క‌లిసి టూర్స్‌కు వెళ్లిన ఫొటోలు గ‌తంలో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఉద్దేశిస్తూ ర‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియాలో చేసిన కామెంట్స్‌, ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న క్లోజ్‌నెస్‌ను బ‌ట్టి విజ‌య్‌, ర‌ష్మిక‌ప్రేమ‌లో ఉన్నది నిజ‌మేనంటూ టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

శుక్ర‌వారం నాడు విజ‌య్ ర‌ష్మిక ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు ఒకే స‌మ‌యంలో క‌నిపించ‌డంతో డేటింగ్ వార్త‌లు మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారాయి. టీష‌ర్ట్స్‌, జీన్స్ ధ‌రించి క్యాజువ‌ల్ లుక్‌లో విజ‌య్‌, ర ష్మిక క‌నిపిస్తున్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరిద్ద‌రు క‌లిసి విహార‌యాత్ర కోసం మాల్దీవులు వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌ష్మిక మంద‌న్న న‌టించిన తొలి బాలీవుడ్ సినిమా గుడ్‌బై శుక్ర‌వారం రిలీజైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో ఇన్నాళ్లు ర‌ష్మిక మంద‌న్న బిజీగా గ‌డిపింది. బిజీ షెడ్యూల్స్ నుంచి సేద తీరేందుకు విజ‌య్‌తో క‌లిసి మాల్దీవులు వెళ్లిన‌ట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ తెలుగులో ఖుషి సినిమా చేస్తున్నాడు. ప్యూర్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అలాగే లైగ‌ర్ (Liger)త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌న‌గ‌ణ‌మ‌న(Janaganamana) సినిమా చేయ‌బోతున్నాడు. మ‌రోవైపు ర‌ష్మిక బాలీవుడ్‌, టాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. హిందీలో మిష‌న్ మ‌జ్ను (Missiom majnu)తో పాటు సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న యానిమ‌ల్ సినిమాలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రోవైపు త్వ‌ర‌లోనే పుష్ప -2 (Pushpa 2) షూటింగ్ మొద‌లుపెట్టేందుకు రెడీ అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న ఈ సీక్వెల్‌కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.