తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Devarakonda Yadadri: యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. ఆలయం గురించి ఏం చెప్పాడంటే?

Vijay Devarakonda Yadadri: యాదాద్రిలో విజయ్ దేవరకొండ.. ఆలయం గురించి ఏం చెప్పాడంటే?

Sanjiv Kumar HT Telugu

03 September 2023, 14:22 IST

  • Vijay Devarakonda In Yadadri: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. మొన్నటివరకు ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేసిన విజయ్ దేవరకొండ తాజాగా యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామిని దర్శించుకున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యాదాద్రిలో విజయ్ దేవరకొండ
యాదాద్రిలో విజయ్ దేవరకొండ

యాదాద్రిలో విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సినీ కెరీర్ ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు వంటి క్లాసిక్ హిట్ తర్వాత బోల్డ్ లవ్ స్టోరీగా అర్జున్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్‍కు అంతకుమించిన క్రేజ్ వచ్చింది. సినిమా ప్రమోషన్స్ నుంచి విడుదల వరకు సినిమాపై కాంట్రవర్సీలు వచ్చినా చివరికీ బ్లాక్ బస్టర్ అయింది. దీంతో విజయ్ పేరు మారుమోగిపోయింది. అనంతరం గీత గోవిందంతో విజయ్ దేవరకొండకు అభిమానులు మరింతగా పెరిగారు.

ట్రెండింగ్ వార్తలు

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

ప్లాప్ సినిమాలు

అయితే విజయ్ దేవరకొండకు ద్వారక, టాక్సీవాలా, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రెడ్ సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ఇక ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ తీవ్ర డిజాస్టర్‌గా మిగిలింది. దీని తర్వాత తాజాగా ఖుషి సినిమాతో వచ్చాడు విజయ్. సెప్టెంబర్ 1న విడుదలైన ఖుషి సినిమాపై ప్రేక్షకులు పాజిటివ్‍గా స్పందిస్తున్నారు. మాస్ ఆడియెన్స్ కు తప్పా ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందని రివ్యూలు అంటున్నాయి. దాదాపుగా విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లే అని చెబుతున్నారు.

స్వామివారి సేవలో

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సక్సెస్‍ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఖుషి సినిమా టీమ్ యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించుకుంది. ఖుషి విజయం సాధించిన నేపథ్యంలో విజయ్ దేవరకొండతోపాటు డైరెక్టర్ శివ నిర్వాణ, నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ స్వామివారు ఆశీస్సులు తీసుకున్నారు. వీరితోపాటు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ఇంటి సభ్యులు సైతం స్వామివారి ఆలయాన్ని సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

అద్భుతంగా తీర్చిదిద్దారు

అయితే విజయ్ దేవరకొండ రాకతో అభిమానులు గుంపులుగా చేరేందుకు ప్రయత్నించారు. కానీ, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ "మా ఖుషి సినిమాకు ఇంత పెద్ద విజయం ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమాకు ఘన విజయం దక్కిన సందర్భంగా మా టీమ్ అంతా కలిసి సకుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చాం. యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత దేవాలయంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నాం. యాదాద్రి నిర్మాణాలు, ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి" అని తెలిపాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం