తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Takkar Trailer Release: 'ధనమే మనిషిని నడిపించే ఇంధనం'.. సిద్ధార్థ్ టక్కర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Takkar Trailer Release: 'ధనమే మనిషిని నడిపించే ఇంధనం'.. సిద్ధార్థ్ టక్కర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

21 May 2023, 19:19 IST

    • Takkar Trailer Release: ప్రముఖ హీరో సిద్ధార్థ్ నటించిన సరికొత్త చిత్రం టక్కర్. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దివ్యాంశం కౌశిక్ హీరోయిన్‌గా చేసిన ఈ మూవీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టక్కర్ ట్రైలర్ విడుదల
టక్కర్ ట్రైలర్ విడుదల

టక్కర్ ట్రైలర్ విడుదల

Takkar Trailer Release: హీరో సిద్ధార్థ్ కాస్త గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చివరగా మహాసముద్రం అనే మూవీలో కనిపించిన ఈ హీరో.. కాస్త విరామం తర్వాత తెలుగులో రాబోతున్నాడు. అతడు నటించిన సరికొత్త చిత్రం టక్కర్. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ ఏకకాలంలో విడుదల కానుంది. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తోంది. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సిద్ధార్థ్ టక్కర్ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

Jr NTR: ఎన్టీఆర్ పుట్టిన రోజున ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్! ప్రశాంత్ నీల్‍తో మూవీ అప్‍డేట్‍తో పాటు..

టక్కర్ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సిద్ధార్థ్ ఈ మూవీలో సరికొత్తగా కనిపించారు. ఫ్రెంచ్ లుక్‌లో అదరగొట్టాడు. ఇందులో సిద్ధార్థ్ డబ్బు అంటే వ్యామోహముండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్‌ను నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే ఇంధనం. దాన్ని సంపాదించుకోడానికి ఒక్కొక్కడిదీ ఒక్కో దారి.. ఆ దారి అందరికీ ఒకటే అయినప్పుడు.. అంటూ సిద్ధార్థ్ తనను తాను పరిచయం చేసుకునే సంభాషణ ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తోంది. అభిమన్యు సింగ్, మునీష్ కాంత్, ఆర్జే వీజ్ఞేశ్ కాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత సిద్ధార్థ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల్లో ఈ మూవీపై బజ్ క్రియేట్ అయింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తిక్ జీ క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నివాస్ కే ప్రసన్న సంగీతాన్ని సమకూర్చారు. వంచింతన్ మురుగేశన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. జీఏ గౌతమ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. జూన్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ విడుదల కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.