Samantha on Item Songs: ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయను.. అందుకే నా వ్యాధిని బయటపెట్టాల్సి వచ్చింది: సమంత
16 March 2024, 14:03 IST
- Samantha on Item Songs: టాలీవుడ్ నటి సమంత ఊ అంటావాలాంటి ఐటెమ్ సాంగ్ మళ్లీ చేయనని చెప్పింది. అంతేకాదు తనకున్న మయోసైటిస్ వ్యాధి గురించి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.
ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయనంటున్న సమంత
Samantha on Item Songs: టాలీవుడ్లో టాప్ నటిగా ఉన్న సమంత పుష్ప మూవీలో ఊ అంటావాలాంటి ఐటెమ్ సాంగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పాటలో ఆమె అల్లు అర్జున్ తో వేసిన స్పెప్పులు కూడా షాకింగా ఉన్నాయి. అయితే అలాంటి ఐటెమ్ సాంగ్ తాను మళ్లీ చేయనని ఆమె చెబుతోంది. ఇండియా టుడే కాన్క్లేవ్ లో మాట్లాడిన సామ్.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
అందంగా లేను. ఇతర అమ్మాయిలలాగా లేను అన్న ఆలోచనలతోనే పని చేశాను. అందుకే నాకు అది పెద్ద ఛాలెంజ్ అనుకున్నాను. ఊ అంటావా మొదటి షాట్ లో నేను వణికిపోయాను. ఎందుకంటే సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. కానీ అలాంటి అసౌకర్యమైన, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే నన్ను నేను ఓ నటిగా, వ్యక్తిగా వృద్ధి చెందుతూ వచ్చాను" అని సమంత తెలిపింది.
ఊ అంటావాలాంటి పాట మళ్లీ చేస్తారా అన్ని ప్రశ్నించగా చేయనని చెప్పింది. "లేదు, ఇక అలాంటి వాటిలో సవాలంటూ ఏమీ లేదు. ఆ పాటలోని లిరిక్స్ నాకో ఛాలెంజ్" అని సమంత స్పష్టం చేసింది.
ఆ వ్యాధి గురించి అందుకే చెప్పాను
ఇక తనకున్న మయోసైటిస్ వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే వెల్లడించాల్సి వచ్చిందని సమంత తెలిపింది. యశోద మూవీ సమయంలోనే ఆమె ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పుడు వస్తున్న పుకార్లు, తప్పుడు సమచారాలకు అడ్డుకట్ట వేయడానికి తాను దీని గురించి చెప్పాల్సి వచ్చిందని సామ్ తెలిపింది.
"నాకున్న వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో నా ఫిమేల్ సెంట్రిక్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడు నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. నేను దానికి సిద్ధంగా లేను. పుకార్లు వ్యాపిస్తున్నాయి. తప్పుడు సమాచారాలు బయటకు వస్తున్నాయి. ఆ సినిమాను ప్రమోట్ చేయాలని, లేదంటే ఫ్లాపవుతుందని ప్రొడ్యూసర్లు నాతో అన్నారు.
ఆ సమయంలో మరీ ఎక్కువ డోసుల్లో మెడికేషన్ పై ఉన్నాను. అందువల్ల అది తప్పనిసరి పరిస్థితి. లేదంటే ఆ విషయం ఎప్పటికీ బయటకు చెప్పేదానిని కాదు" అని సమంత స్పష్టం చేసింది.
సానుభూతి కోసం చూస్తున్నానంటూ తనను సింపథీ క్వీన్ అని కూడా పిలిచినట్లు సమంత ఈ సందర్భంగా వాపోయింది. అయితే ఈ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే తాను ఇవాళ ఓ నటిగా, వ్యక్తిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పింది. ఖుషీ మూవీ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత.. ఇక ఇప్పుడు సిటడెల్ అనే వెబ్ సిరీస్ తో రాబోతోంది.