తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna: అక్కినేని హీరోతో రొమాన్స్ చేయ‌నున్న ర‌ష్మిక‌

Rashmika Mandanna: అక్కినేని హీరోతో రొమాన్స్ చేయ‌నున్న ర‌ష్మిక‌

HT Telugu Desk HT Telugu

08 August 2022, 11:27 IST

  • గీతాగోవిందం త‌ర్వాత మ‌రోసారి ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌తో ర‌ష్మిక మంద‌న్న(Rashmika Mandanna) సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో ఎవ‌రంటే...

ర‌ష్మిక మంద‌న్న
ర‌ష్మిక మంద‌న్న (instagram)

ర‌ష్మిక మంద‌న్న

ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ లో సినిమాల ఎంపిక‌లో నిదానంగా ఆడుగులు వేస్తోంది. పుష్ప, సీతారామం సక్సెస్ ల త‌ర్వాత తెలుగు కొత్త సినిమాలేవీ అంగీక‌రించ‌లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో ర‌ష్మిక ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Aditya Kapur Ananya Panday: బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆదిత్య కపూర్, అనన్య పాండే బ్రేకప్ చేసుకున్నారా? వివరాలివే

Aa Okkati Adakku Collections: బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్కటి అడక్కు మూవీ జోరు.. తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువగా..

Geethanjali Malli Vachindi OTT: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే! ఎక్కడ చూడొచ్చంటే..

Gam Gam Ganesha: ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసే మంచి క్రైమ్ కామెడీ మూవీ: డైరెక్టర్

స‌ర్కారువారి పాట సక్సెస్ అనంతరం నాగ‌చైత‌న్య‌తో (Naga Chaitanya)ఓ సినిమా చేయ‌బోతున్నారు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌(Parasuram). ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు నాగేశ్వ‌ర‌రావు అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ తుదిద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ప‌ర‌శురామ్ తెర‌కెక్కించిన గీతాగోవిందం సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే ర‌ష్మిక టాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా మారిపోయింది. త‌న‌కు ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడిపై ఉన్న న‌మ్మ‌కంతోనే ర‌ష్మిక మంద‌న్న ఈ సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం.

నాగేశ్వ‌ర‌రావుతోనే నాగ‌చైత‌న్య‌తో తొలిసారి జోడీగా ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌బోతున్న‌ది. కాగా గుడ్‌బై సినిమాతో ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. అక్టోబ‌ర్ 7న ఈ సినిమా రిలీజ్‌కానుంది. గుడ్ బై తో పాటుగా హిందీలో మిష‌న మ‌జ్ను, , యానిమ‌ల్ సినిమాలు చేస్తోంది. తెలుగులో పుష్ప‌-2లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్‌లో సెట్స్‌పైకిరానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.