తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Did You Know: రంగీలాలో రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవి.. ఏ రేంజ్ లో ఉండేదో?

Did You Know: రంగీలాలో రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవి.. ఏ రేంజ్ లో ఉండేదో?

25 November 2021, 15:08 IST

    • అమీర్ ఖాన్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన రంగీలా 1995లో విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది ఈ సినిమా. అయితే ఈ చిత్రంలో మొదట ప్రధాన పాత్రలుగా అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ కాదట.
రజినీ కాంత్
రజినీ కాంత్ (Hindustan times)

రజినీ కాంత్

రామ్ గోపాల్ వర్మకు తెలుగులోనే కాదు బాలివుడ్ లోనూ సంచలన దర్శకుడిగా గుర్తింపు ఉంది. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలకు ఆర్జీవీ పెట్టింది పేరు. ఆయన తీసిన శివ, క్షణ క్షణం, గాయం, రంగీలా లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆయనను దిగ్గజ దర్శకుల సరసన నిలుచేలా చేశాయి. ముఖ్యంగా రంగీలా చిత్రం బాలివుడ్ సినీ దృక్కోణాన్ని మార్చివేసింది. కేవలం అక్కడే కాదు తెలుగులోనూ డబ్ అయి పాన్ ఇండియా హిట్ అయింది. అమీర్ ఖాన్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన రంగీలా 1995లో విడుదలై థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది ఈ సినిమా. అయితే ఈ చిత్రంలో మొదట ప్రధాన పాత్రలుగా అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ కాదట. రామ్ గోపాల్ వర్మ కథ రాసినప్పుడు ఈ స్టోరీని రజినీకాంత్, నాగార్జున, శ్రీదేవితో తీయాలనుకున్నాడట. అవును ఈ విషయాన్ని ఈ చిత్రంలో నటించిన ఊర్మిళా మటోండ్కరే ఓ సందర్భంలో తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

Mega vs Allu fans: మెగా, అల్లు అభిమానుల మధ్య పెరుగుతూనే ఉన్న గ్యాప్! మీమ్‍లతో ఫ్యాన్స్ వార్

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

రంగీలా చిత్రం కోసం మొదట రజినీకాంత్, శ్రీదేవి, నాగార్జునను ఆర్జీవీ సంప్రదించారని ఆమె చెప్పింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ముగ్గురు సినిమా నుంచి వైదొలిగారని, అనంతరం ఆ అవకాశం మా వద్దకు వచ్చిందని స్పష్టం చేసింది. డేట్స్ సమస్యతో ముందుగా రజినీ వైదొలిగారని, అనంతరం శ్రీదేవి, నాగార్జున నో చెప్పారని చెప్పింది. చివరకు పాత్రలకు అనుగుణంగా తమను తీసుకున్నట్లు ఊర్మిళా తెలిపింది.

అన్ని కుదిరినట్లయితే రంగీలా రజినీకాంత్, శ్రీదేవి, నాగార్జును ఒక తెరపై చూసేవాళ్లం. ఆ ముగ్గురు ఈ సినిమాకు పర్ఫెక్టుగా సరిపోతారు కూడా. ఈ ముగ్గురు స్టార్లు లేనప్పటికీ అమీర్, ఊర్మిళా, జాకీ ష్రాఫ్ తమ అభినయంతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. పాన్ ఇండియా స్థాయిలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిందీ చిత్రం. ముఖ్యంగా హిందీ సినిమా ఫ్యాషన్ పోకడలను మార్చింది. ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డుకు శ్రీకారం చుట్టింది. ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా ఈ సినిమాతో తొలి ఫిల్మ్ ఫేర్ ను అందుకున్నారు. ఆ సంవత్సరం ఈ చిత్రానికి మొత్తం 7 ఫిల్మ్ ఫేర్లు దక్కాయి. ఏఆర్ రెహ్మాన్ తన సంగీతంతో యావత్ దేశాన్ని మైమరిపించాడు. ఆయనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ దక్కించుకున్నారు. ఆర్జీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వర్మ క్రియేషన్స్ బ్యానర్ పై నీరజ్ వోరా, రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం