తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Puri Jagannadh: ఛార్మితో రిలేష‌న్‌షిప్‌పై పూరి జ‌గ‌న్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Puri Jagannadh: ఛార్మితో రిలేష‌న్‌షిప్‌పై పూరి జ‌గ‌న్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

HT Telugu Desk HT Telugu

19 August 2022, 10:13 IST

  • ఛార్మి(Charmi)తనకు ఇరవై ఏళ్లుగా తెలుసునని అన్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)ఛార్మితో రిలేషన్ షిప్ పై లైగర్ ప్రమోషన్స్ లో పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి (twitter)

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మి

గత కొన్నేళ్లుగా పూరి జగన్నాథ్ తో కలిసి ప్రయాణాన్ని సాగిస్తుంది ఛార్మి. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు నిర్మాణపరమైన వ్యవహారాల మొదలుకొని ప్రమోషన్స్ వరకు అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. అనుక్షణం పూరి జగన్నాథ్ వెంటే ఉంటూ అతడికి సపోర్ట్ గా నిలుస్తోంది. పూరి జగన్నాథ్ షేర్ చేసే ప్రతి ఫొటోలో ఛార్మి తప్పకుండా కనిపిస్తుంది. వీరిద్దరి రిలేషన్ షిప్ గాపై చాలా కాలంగా అనేక పుకార్లు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Madgaon Express OTT: ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ యాక్టర్ సూపర్ హిట్ కామెడీ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే?

Yuvaraj OTT: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన కాంతార హీరోయిన్ మూవీ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?

Bollywood Actor: 200 సినిమాల్ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ న‌టుడు - సూప‌ర్‌స్టార్ కావాల్సినోడు .. సీరియ‌ల్స్ చేస్తోన్నాడు

Prabhas Marriage: ప్రభాస్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్.. కాబోయే భార్య గురించేనా డార్లింగ్ పోస్ట్?

వీటిపై ఛార్మి చాలా సార్లు స్పందించింది. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని బదులిచ్చింది. కాగా ఛార్మితో ఉన్న అనుబంధంపై చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పూరి జగన్నాథ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛార్మికి పదమూడేళ్లు ఉన్నప్పటి నుండి ఆమె తనకు తెలుసునని అన్నాడు. తాను చాలా హార్డ్ వర్కర్ అని పేర్కొన్నది. రెండు దశాబ్దాలుగా తనతో స్నేహం ఉందని తెలిపాడు.

ఛార్మి వయసు యాభై ఏళ్లు దాటినా, ఆమెకు పెళ్లైనా ఈ ప్రచారాలు ఉండేవి కాదని పూరి జగన్నాథ్ అన్నాడు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఛార్మి యంగ్ ఏజ్ లో ఉంది కాబట్టే తమ ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. జంటల మధ్య ఉండే శృంగార ఆకర్షణలు, వాంఛలు తొందరగా చచ్చిపోతాయి. కానీ స్నేహం మాత్రమే ఎళ్లకాలం నిలిచిపోతుంది’ అని పూరి జగన్నాథ్ పేర్కొన్నాడు.

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతాలతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం