తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas: ప్రభాస్‌, అమితాబ్‌, నాని, ప్రశాంత్‌ నీల్‌, దుల్కర్‌ సల్మాన్‌ ఒకే చోట.. వీడియో వైరల్‌

Prabhas: ప్రభాస్‌, అమితాబ్‌, నాని, ప్రశాంత్‌ నీల్‌, దుల్కర్‌ సల్మాన్‌ ఒకే చోట.. వీడియో వైరల్‌

HT Telugu Desk HT Telugu

29 June 2022, 22:05 IST

    • Prabhas: ఒకరు, ఇద్దరు కాదు.. అక్కడున్నవాళ్లంతా స్టార్లే. పాన్‌ ఇండియా స్టార్లంతా ఒక్కచోట చేరారు. అదీ మన హైదరాబాద్‌లోనే. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్
వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ (twitter)

వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్

ఓవైపు బాలీవుడ్‌ షెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌.. మరోవైపు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఇంకోవైపు కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. వీళ్లకుతోడు నేచురల్‌ స్టార్‌ నాని, మలయాళ సూపర్‌స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌.. వీళ్లంతా ఒకే దగ్గర చేరితే ఎలా ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్‌లో వైజయంతీ మూవీస్‌ 50 ఏళ్ల సంబరాల సందర్భంగా ఈ స్టార్లు కలిశారు. పార్టీ ఎంజాయ్‌ చేశారు. కబుర్లతో కాలక్షేపం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Rajamouli: అందుకోసం మీడియా ముందుకు రానున్న రాజమౌళి.. మహేశ్‍తో సినిమా గురించి ఏమైనా చెబుతారా?

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

ఈ వీడియోను బుధవారం (జూన్‌ 29) వైజయంతీ మూవీస్‌ ట్వీట్‌ చేయడం విశేషం. నిజానికి కొన్ని రోజుల ముందే ఈ ఈవెంట్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వీళ్లందరితో అమితాబ్‌ ఫొటోలకు పోజులివ్వడం, అటు నాని కూడా బిగ్‌ బీతో దిగిన ఫొటోలు షేర్‌ చేసుకోవడంతో ఈ పార్టీ గురించి తెలిసింది. అయితే ఇప్పుడు వైజయంతీ మూవీసే అధికారికంగా ఆ వీడియో రిలీజ్‌ చేశారు.

ఇందులో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ప్రభాస్‌.. వైజయంతీ మూవీస్‌ కొత్త ఆఫీస్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఆఫీస్‌ అంతా తిరుగుతూ, ఈ నిర్మాణ సంస్థ 50 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన ఫొటోలు చూస్తూ గడిపారు. ప్రస్తుతం ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకోన్‌ నటిస్తున్న ప్రాజెక్ట్ కేను వైజయంతీ మూవీసే నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ కే మూవీకి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. ఇదొక సైన్స్ ఫిక్షన్‌ మూవీ.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.