తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu On Ssmb29: రాజమౌళితో సినిమాపై తొలిసారి అప్డేట్ ఇచ్చిన మహేష్.. ఆ మూడు సినిమాల వల్లే తానిలా అంటూ..

Mahesh Babu on SSMB29: రాజమౌళితో సినిమాపై తొలిసారి అప్డేట్ ఇచ్చిన మహేష్.. ఆ మూడు సినిమాల వల్లే తానిలా అంటూ..

Hari Prasad S HT Telugu

05 March 2024, 10:33 IST

    • Mahesh Babu on SSMB29: దర్శక ధీరుడు రాజమౌళితో సినిమాపై తొలిసారి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన కెరీర్లో తర్వాతి సినిమాతోపాటు కెరీర్ నే మలుపు తిప్పిన మూడు సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు.
రాజమౌళితో సినిమాపై తొలిసారి అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు
రాజమౌళితో సినిమాపై తొలిసారి అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు

రాజమౌళితో సినిమాపై తొలిసారి అప్డేట్ ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu on SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతేకాదు తన తర్వాతి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాజమౌళితో సినిమా కోసమూ ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమాపై అతడు తాజాగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. ఆ సినిమా గురించి అతడు ఏమన్నాడంటే..

ట్రెండింగ్ వార్తలు

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

రాజమౌళితో సినిమాపై..

రాజమౌళి, మహేష్ బాబు సినిమా అంటే టాలీవుడ్ అనే కాదు మొత్తం ఇండియన్ సినిమా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అందులోనూ ఈ మూవీ ఇండియానా జోన్స్ లైన్ లో సాగే ఓ జంగిల్ యాక్షన్ అడ్వెంచర్ జానర్ అని కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఎస్ఎస్ఎంబీ29పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రాజమౌళితో తాను చేయబోయే సినిమా తొలిసారి మహేష్ స్పందించాడు.

ఈ ఇంటర్వ్యూలోనే మహేస్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చాడు. "రాజమౌళి సర్ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు చాలా బాగా సాగుతున్నాయి. త్వరలోనే మూవీని ప్రారంభించడానికి నేను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను" అని మహేష్ ఈ ఇంటర్వ్యూలో అన్నాడు. ఈ సినిమాపై ఉగాదినాడు కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచే మూవీ షూటింగ్ ప్రారంభం కానుందనీ వార్తలు వస్తున్నాయి.

కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలపై..

ఇక తన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలపైనా తాజా ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్పందించాడు. "నా కెరీర్ ను మలుపు తిప్పిన మూడు సినిమాలు అంటే కచ్చితంగా మురారి, పోకిరి, శ్రీమంతుడు అనే చెబుతాను. ఇందులోని ప్రతి ప్రాజెక్ట్ లో ఓ భిన్నమైన స్టోరీ టెల్లింగ్ నేను చూశాను. అవి నన్ను ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేలా చేశాయి" అని మహేష్ అన్నాడు.

నిజానికి మహేష్ చెప్పినట్లు ఆయా సందర్భాల్లో కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పిన సినిమాలు ఇవే అని చెప్పొచ్చు. 2001లో వచ్చిన మురారి, 2006లో వచ్చిన పోకిరి, 2015లో వచ్చిన శ్రీమంతుడు.. మహేష్ ఇమేజ్ కు ఓ కొత్త రూపు తీసుకొచ్చాయి.

గుంటూరు కారం సక్సెస్‌పై..

ఇక తన లేటెస్ట్ గుంటూరు కారం మూవీపై మొదట్లో తీవ్ర విమర్శలు రావడం.. అయినా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించి, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ దూసుకెళ్తుండటంపై మహేష్ స్పందించాడు. "గుంటూరు కారం సినిమా సవాళ్లు ఎదుర్కొన్నా ఆడియెన్స్ తో కనెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది సినిమాల సరళమైన కథనాల శక్తిని, నా అభిమానుల మద్దతుకు అద్దం పడుతోంది" అని అతడు అన్నాడు.

బాక్సాఫీస్ నంబర్లు ముఖ్యమే అయినా.. ఓ సినిమా ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని కూడా తాను సక్సెస్ కు ఓ కొలమానంగా తీసుకుంటున్నట్లు మహేష్ తెలిపాడు. చాలా వరకూ ప్రైవేట్ గా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడే ఈ సూపర్ స్టార్.. సినిమాలు, ప్రైవసీని బ్యాలెన్స్ చేయడం ఓ సవాలే అని అన్నాడు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ29 సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ లెవల్లో వస్తున్న మూవీగా అంచనా వేస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం