తెలుగు న్యూస్  /  Entertainment  /  Kangana Ranaut Says Her Dhaakad Movie Was Historic Flop

Kangana Ranaut On Pathaan : అవును ధాకడ్ మూవీ అట్టర్ ఫ్లాప్.. మాకూ అవకాశం వస్తుంది

Anand Sai HT Telugu

28 January 2023, 6:19 IST

    • Kangana Ranaut Tweet : బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాస్పదం కామెంట్స్ చేస్తుంది. తాజాగా షారుఖ్ ఖాన్ సినిమా గురించి మాట్లాడింది. అతడి ఫ్యాన్స్ ధాకడ్ సినిమా కలెక్షన్స్ గుర్తు చేశారు.
కంగనా రనౌత్
కంగనా రనౌత్

కంగనా రనౌత్

నటి కంగనా రనౌత్ చాలా మంది స్టార్ ఆర్టిస్టులపై అప్పుడప్పుడు విరుచుకుపడుతోంది. ఎప్పటి నుంచో కొంతమందిని వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు షారుఖ్ నటించిన 'పఠాన్' సినిమా అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ షారుఖ్ ఖాన్ పై వ్యాఖ్యలు చేసింది. అయితే పఠాన్ సినిమా విజయాన్ని తట్టుకోలేనట్లు కనిపిస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Krishnamma: ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఒకే వేదికపై రాజమౌళి, సుకుమార్ సహా మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు

Ranveer Singh: రణ్‍వీర్ సింగ్ - ప్రశాంత్ వర్మ సినిమాకు టైటిల్ ఇదేనా?

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

20 నెలల క్రితం సస్పెండ్ అయిన కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా ఇప్పుడు మళ్లీ వచ్చింది. ట్విట్టర్‌లో మళ్లీ యాక్టివ్‌గా ఉంటోంది. పరోక్షంగా, కొన్నిసార్లు ప్రత్యక్షంగా కూడా పఠాన్ సినిమాపై మాట్లాడుతోంది. దీంతో షారూఖ్ ఖాన్ అభిమానులకు కోపం వచ్చింది. నెటిజన్లు మళ్లీ కంగనా 'ధాకడ్' ఫెయిల్యూర్‌ని గుర్తు చేశారు.

కంగనా నటించిన ధాకడ్ చిత్రం తొలిరోజు 55 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. మొత్తంగా రూ.2.58 కోట్లు మాత్రమే వచ్చాయి. 'అయితే పఠాన్ సినిమా తొలిరోజే 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. కాబట్టి నిరాశతో కంగనా ఇలా ప్రవర్తిస్తోంది' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్‌పై కంగనా రనౌత్ స్పందించింది. 'అవును, ధాకడ్ సినిమా చారిత్రాత్మక పరాజయం. నేను ఎప్పుడైనా దాన్ని అంగీకరించకుండా ఉండనా? షారుఖ్ ఖాన్ గత పదేళ్లలో తన మొదటి విజయాన్ని అందుకున్నాడు. మాకూ అవకాశం వస్తుంది' అని కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేసింది.

నటి కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమా పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి ఆమె స్వయంగా దర్శకత్వం వహిస్తోంది. నిర్మాణంలో కూడా ఉంది. అందుకే తన ఆస్తులన్నీ ఈ సినిమాలో పెట్టుబడి పెట్టింది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ పరిస్థితులపై 'ఎమర్జెన్సీ' సినిమా రూపొందుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందోనని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

అయితే పఠాన్ సినిమాను కంగనా మెచ్చుకుంది. ‘పఠాన్ బాగా ఆడుతోంది. ఇలాంటి సినిమాలు ఆడాలి కూడా. మన హిందీ సినిమా వాళ్లు వెనుకబడిపోయిన ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు" అని కంగనా చెప్పింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అనుపమ్ ఖేర్ కూడా.. పఠాన్ పెద్ద సినిమా.. భారీ బడ్జెట్ తో రూపొందించారు అని అన్నాడు. సౌత్ సినిమాల హవాలో హిందీ సినిమా కొట్టుకుపోతున్న సమయంలో పఠాన్ బాలీవుడ్ లో కొత్త ఆశలు రేపిందనడంలో సందేహం లేదు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.