తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Chiranjeevi Trinadha Rao Nakkina Movie: ధ‌మాకా డైరెక్ట‌ర్‌కు చిరంజీవి ఛాన్స్‌ - ఈ కాంబో కుదిరిందా?

Chiranjeevi Trinadha Rao Nakkina Movie: ధ‌మాకా డైరెక్ట‌ర్‌కు చిరంజీవి ఛాన్స్‌ - ఈ కాంబో కుదిరిందా?

HT Telugu Desk HT Telugu

30 January 2023, 6:34 IST

  • Chiranjeevi Trinadha Rao Nakkina Movie: బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌ను మొద‌లుపెడుతూ జోరుమీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయ‌న మ‌రో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే...

చిరంజీవి
చిరంజీవి

చిరంజీవి

Chiranjeevi Trinadha Rao Nakkina Movie: వాల్తేర్ వీర‌య్య స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు చిరంజీవి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు వంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన వాల్తేర్ వీర‌య్య‌ 2023లో తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. గ్రాండ్ స‌క్సెస్‌ ద‌క్కిన ఆనందంలో చిరంజీవి మ‌రో సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Heroin: మురారి సినిమాలో మహేశ్‍కు జోడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

ధ‌మాకా ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన‌తో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ధ‌మాకా సినిమాతో ర‌వితేజ‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు త్రినాథ‌రావు న‌క్కిన‌. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా వంద కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. కామెడీ, మాస్ అంశాల‌కు ఇంపార్టెన్స్ ఇస్తూ రూపొందించిన ఈ సినిమా ర‌వితేజ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.

గ‌త సినిమాల త‌ర‌హాలోనే చిరు కోసం ప‌వ‌ర్‌ఫుల్ మాస్ కామెడీ క‌థ‌ను ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. చిరంజీవి- త్రినాథ‌రావు న‌క్కిన కాంబో సినిమాను డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూస‌ర్ డీవీవీ దాన‌య్య నిర్మించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

వెంకీ కుడుముల సినిమా స్థానంలో...

గ‌తంలో చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు డీవీవీ దాన‌య్య అనౌన్స్‌చేశాడు. కానీ క‌థ కొలిక్కి రాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వెంకీ కుడుముల మూవీ స్థానంలోనే త్రినాథ‌రావు న‌క్కిన సినిమాను డీవీవీ దాన‌య్య అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే చిరంజీవి- త్రినాథ‌రావు న‌క్కిన సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు స‌మాచారం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం