తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sharwanand Accident : హీరో శ‌ర్వానంద్‌కి రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా

Sharwanand Accident : హీరో శ‌ర్వానంద్‌కి రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా

HT Telugu Desk HT Telugu

28 May 2023, 12:08 IST

    • Sharwanand Road Accident : కొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న హీరో శర్వానంద్ కి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన వెళ్తున్న కారు.. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
శర్వానంద్
శర్వానంద్ (Twitter)

శర్వానంద్

హీరో శర్వానంద్(Sharwanand) మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోనున్నాడు. అయితే ఆయనకు ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిల్మ్ నగర్(Film Nagar)లోని జంక్షన్ వద్ద అతడి రేంజ్ రోవర్ కారు.. అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో శర్వాకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం శర్వానంద్ పరిస్థితి బాగానే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

Keerthy Suresh Kalki 2898 AD: కల్కి 2898 ఏడీలో కీర్తి సురేష్.. ప్రభాస్‌కు ప్రాణ మిత్రుడిగా మహానటి

Murari Heroin: మురారి సినిమాలో మహేశ్‍కు జోడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

'హీరో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా వున్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు.' అని శర్వానంద్ టీమ్ ప్రకటించింది.

కారుకు ఉన్న సేఫ్టీ ఫీచర్స్ కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం శర్వానంద్(Sharwanand) క్షేమంగా ఉన్నాడు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నపాటి గాయాలు మినహా ఏం కాలేదని, ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని డాక్టర్లు కూడా చెప్పారు.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 26నే వీరి నిశ్చితార్థం హైదరాబాద్‌(Hyderabad)లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ కు చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, నాని, చాలా మంది ప్రముఖులు వచ్చారు. అయితే పెళ్లికి తేదీ ప్రకటించకపోవడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని కొంతమంది పుకారు లేపారు. దీంతో వెంటనే పెళ్లి తేదీ ప్రకటించారు. జూన్ 2, 3 తేదీల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు.

రాజస్థాన్ లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె రక్షిత రెడ్డిని శర్వానంద్ వివాహం చేసుకోనున్నాడు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా.. ఇలా జరగడంతో ఇటు కుటుంబ సభ్యులు, అటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ఒకే ఒక జీవితం(Oke Oka Jivitham) చిత్రంతో హిట్ సాధించాడు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య(Sriram Aditya)తో అప్ కమింగ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి.. లండన్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారట.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం