తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Online Services In Temples : ఈ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

Online Services In Temples : ఈ ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు

HT Telugu Desk HT Telugu

20 September 2022, 21:27 IST

    • Andhra Pradesh Temples : ఏపీలోని ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. అన్నీ ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను దశల వారీగా తీసుకురానున్నట్టుగా దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు
ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు

ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు

రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఎనిమిది ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయి. 'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ఆలయాల్లోనూ దశలవారీగా ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తాం. శ్రీశైలం దేవస్థానం(Srisailam Temples)లో ఇప్పటికే సాంకేతిక సంస్థ సహకారంతో ఆన్‌లైన్ సేవలను చేపట్టాం. శ్రీశైలంలో విజయవంతమైన తర్వాత, ఇప్పుడు అదే సంస్థ ఇతర ప్రముఖ దేవాలయాలలో ఆన్‌లైన్ సేవలను ఉచితంగా చేసే పనిని చేపట్టింది.' అని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

'ఏపీలో అన్ని ఆలయాల్లో ఇకపై తిరుమల తరహా ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి తెస్తాం. ఆన్ లైన్ సేవల కోసం aptemples.gov.in పేరిట వెబ్ సైట్ ఏర్పాటు చేశాం. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానంలో వెబ్ సైట్ సేవలు ప్రయోగాత్మకంగా పరిశీలించాం. దశల వారీగా అన్ని ఆలయాలకు ఆన్ లైన్ విధానం వర్తింపజేస్తాం. అవినీతి లేని పారదర్శక విధానాల కోసమే ఆన్ లైన్ వ్యవస్థను తీసుకువస్తున్నాం. దర్శనాల స్లాట్ బుకింగ్ లు, వసతి, కానుకల సమర్పణ అన్నీ ఆన్ లైన్ చేస్తున్నాం.' అని మంత్రి వెల్లడించారు.

తొమ్మిది ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్ సేవలు(Online Services) ప్రారంభమవుతున్నాయి. విజయవాడ కనకదుర్గ(Vijayawada Kanakadurga) ఆలయంలో ఈ దసరా మహోత్సవం నుంచి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం, శ్రీకాళహస్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు ఆలయాల్లో కూడా ఆన్‌లైన్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని తెలిపారు.

'ఆలయ భూములు, ఆభరణాలపై జియో ట్యాగింగ్ చేయనున్నాం. ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, దీనివల్ల ఎలాంటి అవినీతికి తావులేకుండా పోతుంది. భక్తులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా గదులు, దర్శన టిక్కెట్లు, సేవాలు, ఇ-హుండీ మరియు ఇతర సేవలను బుక్ చేసుకోవచ్చు. భక్తుల సేవలు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా కొనసాగుతాయి.' అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

తదుపరి వ్యాసం