తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crime News | చాక్లెట్లు కొనిస్తానని చిన్నారిని తీసుకెళ్లిన యువకుడు.. ఆపై నోట్లో దుప్పటి కుక్కి..

Crime News | చాక్లెట్లు కొనిస్తానని చిన్నారిని తీసుకెళ్లిన యువకుడు.. ఆపై నోట్లో దుప్పటి కుక్కి..

HT Telugu Desk HT Telugu

21 March 2022, 15:22 IST

    • ఓ చిన్నారికి మాయమాటలు చెప్పాడు ఓ యువకుడు. తనతో వస్తే.. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మి వెళ్లింది బాలిక. ఇదే అదునుగా.. దారుణం చేశాడు ఆ ప్రబుద్ధుడు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

అత్యాచారాలపై ఎంత కఠినంగా ఉన్నా.. కామాంధులు రెచ్చిపోతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. అలాంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఒకటో తరగతి చదువుతున్న చిన్నారిపై.. ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆపై ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడు. అసలు వివరాల్లోకి వెళ్తే..

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామంలో 19 ఏళ్ల యువకుడు ఉన్నాడు. ఇటీవలే ఆ యువకుడు ఉండే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి వచ్చింది. రోడ్డుపై ఆడుకుంటున్న ఆ బాలికను చూశాడు యువకుడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిపెడతానని మాటలు చెప్పాడు. నిజమేనని నమ్మింది చిన్నారి. యువకుడితో కలిసి వెళ్లింది. అయితే అతడు.. బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు.

ఇంట్లోకి తీసుకెళ్లాక.. తన వికృత ఛేష్టలు మెుదలుపెట్టాడు యువకుడు. బాలిక నోట్లో దుప్పటి కుక్కి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పి బెదిరించాడు. తర్వాత రోడ్డు మీదే వదిలేసి వెళ్లిపోయాడు. బాలికను చూసిన స్థానికులు.. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వెంటనే చిన్నారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వెంటనే ఆసుపత్రికి చేరుకుని.. వివరాలు సేకరించారు.

బాలికే స్వయంగా.. యువకుడు చేసిన పని గురించి చెప్పింది. ఎవరికైనా చెబితే.. చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. ఈ విషయం విన్న పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ కేసులు పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. బాలికను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. బాలిక బంధువుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రేమ పేరుతో మోసం..

చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో బాలికను ఓ యువకుడు మోసం చేశాడు. రామకుప్పం మండలంలోని.. ఆవులకుప్పం గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పాడు. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలు మార్లు లైంగికవాంఛ తీర్చుకున్నాడు. 

అయితే ఇటీవలే.. తనను పెళ్లి చేసుకోవాలని బాలిక కోరింది. ఇంకా ఎన్ని రోజులు ఇలా అని నిలదీసింది. దీంతో ఆ వ్యక్తి అసలు రూపం బయటకొచ్చింది. అసలు పెళ్లి చేసుకోనంటూ.. చెప్పాడు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే.. ఇంట్లో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

తదుపరి వ్యాసం