తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Janasena Varahi Yatra 4th Phase : అక్టోబరు 1 నుంచి వారాహి యాత్ర - పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!

Janasena Varahi Yatra 4th Phase : అక్టోబరు 1 నుంచి వారాహి యాత్ర - పవన్ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!

30 September 2023, 5:31 IST

    • Janasena Varahi Vijaya Yatra Updates : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర నాల్గో విడత ఖరారైంది. అక్టోబరు 1వ తేదీన యాత్ర ప్రారంభం కానున్నట్లు పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పవన్ వారాహి యాత్ర
పవన్ వారాహి యాత్ర (Janasena Twitter)

పవన్ వారాహి యాత్ర

Janasena Varahi Vijaya Yatra : వారాహి విజయ యాత్ర నాల్గో విడతకు సంబంధించి కీలక ప్రకటన చేసింది జనసేన పార్టీ. ఇప్పటికే మూడు విడుతలు విజయవంతం కాగా... నాల్గో విడతను కూడా ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీన కృష్ణా జిల్లా నుంచి ప్రారంభించనున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు యాత్రను విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను కూడా నియమించింది.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

షెడ్యూల్ ఇదే…

నాలుగోదశ వారాహి విజయ యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అక్టోబరు 1వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ ఉంటుందని జనసేన పార్టీ తెలిపింది. వారాహి వాహనంపై నుంచి పవన్‌ ప్రసంగిస్తారని వెల్లడించింది. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని అక్టోబరు 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశం కానున్నారు. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని పార్టీ ప్రకటించింది. అక్టోబరు 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ కల్యాణ్ పర్యటించనున్నట్లు తెలిపింది.

పవన్ ప్రసంగంపై ఉత్కంఠ..!

ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ కావటంతో... జైలులో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే... బెయిల్ రావటం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నారా లోకేశ్ చుట్టూ కూడా సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే యువగళం పాదయాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం ఢిల్లీలోనే లోకేశ్ ఉన్నారు. కొద్దిరోజుల కిందటే రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలిశారు పవన్. అనంతరం లోకేశ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేన మధ్య పొత్తు ఉంటుందని సంచలన ప్రకటన చేశారు. వైసీపీని ఓడించటమే తమ లక్షమ్యని ప్రకటించారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

పొత్తుపై కీలక ప్రకటన చేసిన తర్వాత... పవన్ కల్యాణ్ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు.చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో... ఉమ్మడి కార్యాచరణ దిశగా కూడా అడుగులు పడుతున్న పరిస్థితులు ఇప్పటికైతే లేవు. చంద్రబాబు బెయిల్ కోసం టీడీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో... వారాహి యాత్రలో పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరిగానే వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తారా..? పొత్తు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారా..? చంద్రబాబు అరెస్ట్ అంశంపై ఏ విధంగా స్పందిస్తారనేది టాక్ ఆఫ్ ది ఆంధ్రాగా మారింది. ఇక పవన్ చేసే ఈ యాత్రలో…తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఎవరైనా పాల్గొంటారా అనేది కూడా ఉత్కంఠను రేపుతోంది.

తదుపరి వ్యాసం