Maharashtra CM : బీజేపీ భారీ 'స్కెచ్​'.. అందుకే ఏక్​నాథ్​ షిండేకు సీఎం పదవి!-maharashtra cm this is how bjp gains by making eknath shinde the chief minister ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Cm, This Is How Bjp Gains By Making Eknath Shinde The Chief Minister

Maharashtra CM : బీజేపీ భారీ 'స్కెచ్​'.. అందుకే ఏక్​నాథ్​ షిండేకు సీఎం పదవి!

Sharath Chitturi HT Telugu
Jul 01, 2022 06:29 AM IST

Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా ఏక్​నాథ్​ షిండే ప్రమాణం చేయడంతో అందరు షాక్​కు గురయ్యారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్​ ఆ బాధ్యతలు చేపడతారని భావించడమే ఇందుకు కారణం. కానీ దీని వెనుక బీజేపీ భారీ స్కెచ్​ వేసినట్టు కనిపిస్తోంది.

ముంబైలో ఏక్​నాథ్​ షిండే ఫ్లెక్సి
ముంబైలో ఏక్​నాథ్​ షిండే ఫ్లెక్సి (HT PHOTO)

Maharashtra CM : అనుకున్నట్టుగానే మహారాష్ట్రలో మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. శివసేన కీలక నేత ఏక్​నాథ్​ షిండే ప్లాన్స్​ ఫలించాయి. బీజేపీ ఆనందానికి అవధులే లేవు. కానీ మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి ఊహించని విధంగా ట్విస్ట్​ ఎదురైంది. బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడణవీస్​.. సీఎం కుర్చీలో కూర్చుంటారు అని అనుకుంటే.. ఆ స్థానంలో ఏక్​నాథ్​ వచ్చి చేరారు. ఫడణవీస్​కు ఇష్టం లేకపోయినా.. ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఏక్​నాథ్​ను సీఎం చేయడంతో బీజేపీ భారీ స్కెచ్​ వేసినట్టే తెలుస్తోంది. అదేంటంటే..

ఏక్​నాథ్​.. అందుకే!

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేను దెబ్బతీసేందుకే.. ఏక్​నాథ్​ను సీఎం చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉద్ధవ్​ ఠాక్రేకు పెద్దగా ఆప్షన్లు లేవు. భవిష్యత్తులో ఉద్ధవ్​ నుంచి ఏక్​నాథ్​ షిండే.. పార్టీని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేము.

Eknath Shinde cm : పార్టీని స్థాపించిన నాటి నుంచి.. శివసేనకు అంతా 'ఠాక్రే' కుటుంబమే. వారి చేతుల్లో పార్టీ అధికారాలు ఉండేవి. ఆ కుటుంబం ఏం చెబితే అది జరగాల్సిందే! ఇక ఏక్​నాథ్​ షిండేను సీఏం చేయడంతో.. 'ఠాక్రే' కుటుంబం నుంచి శివసేనను తీసేయాలని కమలదళం వ్యూహం రచించినట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి.

మరోవైపు ఏక్​నాథ్​ షిండేను సీఎం చేసి, ఉద్ధవ్​ ఠాక్రేపై బీజేపీ రివేంజ్​ తీర్చుకుందని చెప్పుకోవచ్చు. 2019 వరకు బీజేపీ మిత్రపక్షంగానే ఉన్న శివసేన.. ఆ తర్వాత అనూహ్యంగా జెండా ఎత్తేసింది! సీఎం కుర్చీ విషయంలో గొడవలతో కూటమి నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి ఉద్ధవ్​ ఠాక్రేపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ.. సరైన సమయం చూసి కోలుకోలేని దెబ్బతీసింది అని రాజకీయ విశ్లేషకుల భావన.

Devendra Fadnavis news : 'ఠాక్రేలు లేకుండా శివసేనను ఊహించలేరు' అన్న స్థాయి నుంచి ‘శివసేనలో ఠాక్రేలు ఉంటారా?’ అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి.. శివసేన అంతర్గత గొడవలతోనే ఇది జరిగినా.. ఈ పూర్తి వ్యవహారం బీజేపీకి కలిసివచ్చేదే. రాష్ట్రంలో బీజేపీ, తన పట్టుసాధించుకునేందుకు పని మరింత సులభమైపోయింది. ఇక రాష్ట్రంలో అసలు పోరు ఎన్​సీపీ, కాంగ్రెస్​, శివసేనల మధ్యే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అధికార దాహం లేదు..!

మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సర్వ ప్రయత్నాలు చేస్తోందని.. మూడేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక ప్రభుత్వం కూలిన అనంతరం బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడం ఖాయం అని అందరు భావించారు. ఇదే జరిగి ఉంటే.. బీజేపీ ప్లాన్లతోనే మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిందని అందరు ఫిక్స్​ అయ్యేవారు.

Uddhav Thackeray resign : ఇక ఏక్​నాథ్​ను సీఎం చేయడంతో ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది! తమకు అధికార దాహం లేదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇక దేవేంద్ర ఫడణవీస్​ను డిప్యూటీ సీఎం కూర్చీలో కూర్చొబెట్టి.. మహా వికాస్​ అఘాడీ పతనానికి తాము బాధ్యులము కాదు అని తేల్చిచెప్పేసింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం