Delhi temperature: ఢిల్లీలో గరిష్టంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత; ఎండలకు మాడిపోతున్న ఢిల్లీవాసులు-heatwave alert crucial dos and donts as delhi records 52 3 degrees celsius ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Temperature: ఢిల్లీలో గరిష్టంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత; ఎండలకు మాడిపోతున్న ఢిల్లీవాసులు

Delhi temperature: ఢిల్లీలో గరిష్టంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత; ఎండలకు మాడిపోతున్న ఢిల్లీవాసులు

HT Telugu Desk HT Telugu

Delhi temperature: ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. నగర ప్రజలు అత్యధిక ఉష్ణోగ్రతలతో మాడిపోతున్నారు. ఢిల్లీలోని ముంగేష్ పూర్ లో బుధవారం గరిష్టంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగర ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరిస్తున్నారు.

ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు (File photo)

Delhi temperature: వాయువ్య, మధ్య భారతంలో తీవ్రమైన వడగాలుల మధ్య నేపథ్యంలో రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటున్నాయి. బుధవారం ఢిల్లీలోని ముంగేష్ పూర్ లో 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ (IMD) అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 31న దేశంలోని పలు ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. 2024 మే 31న పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది.

నీటిని వృధా చేయడంపై నిషేధం

దేశంలోని అనేక ప్రాంతాలు కూడా జలవనరులపై విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ఒకవైపు, తట్టుకోలేని స్థాయికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు, తగ్గిపోతున్న భూగర్భ జలవనరులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెంగళూరులో అధికారులు అనవసరంగా నీటిని వృధా చేయవద్దని పౌరులకు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఢిల్లీలో పైప్ తో వాహనాలను కడగడం, గృహావసరాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ, వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం వంటి కార్యకలాపాలను నిషేధించారు. అలా నీటిని వృథా చేసినవారికి రూ .2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

వడగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతల సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • దాహం వేయకపోయినా క్రమం తప్పకుండా నీరు త్రాగాలి.
  • మీకు అనారోగ్యంగా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
  • ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS), నిమ్మకాయ నీరు, మజ్జిగ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలను ఉపయోగించండి, ఇవి శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.
  • తేలికపాటి, లేత రంగులో ఉండే, వదులుగా ఉండే, సున్నితమైన కాటన్ దుస్తులను ధరించండి.
  • ఎండలో బయటకు వెళ్లినప్పుడు సన్స్క్రీన్, గొడుగు/టోపీ, ప్రొటెక్టివ్ గాగుల్స్ వంటివి వాడాలి.
  • పెంపుడు జంతువులు/జంతువులకు త్రాగడానికి పుష్కలంగా నీరు ఇవ్వండి. వాటి షెల్టర్లకు పైకప్పును ఏర్పాటు చేయండి.
  • ఫ్యాన్ లు/ఏసీలు, కర్టెన్ లు లేదా సన్ షేడ్ ఉపయోగించడం ద్వారా, అలాగే, రాత్రిపూట కిటికీలను తెరవడం ద్వారా మీ నివాసాన్ని చల్లగా ఉంచండి.
  • వాటర్ మెలోన్, మస్క్ మెలోన్, ఆరెంజ్, దోసకాయ, సొరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలి.

చేయకూడని పనులు

  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ఆరుబయట కఠినమైన పనుల్లో నిమగ్నం కావద్దు.
  • శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, కార్బొనేటెడ్ శీతల పానీయాలు వంటి తినుబండారాలు, పానీయాలు తీసుకోకూడదు.
  • పార్కింగ్ చేసిన వాహనాల్లో పిల్లలను లేదా పెంపుడు జంతువులను విడిచిపెట్టవద్దు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.