Manish Sisodia arrest : మనీశ్​ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ-excise case delhi court remands sisodia in five day cbi custody ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Excise Case: Delhi Court Remands Sisodia In Five-day Cbi Custody

Manish Sisodia arrest : మనీశ్​ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 06:22 PM IST

Manish Sisodia arrest : ఢిల్లీ లిక్కర్​ పాలసీ స్కామ్​ కేసులో భాగంగా మనీశ్​ సిసోడియాకు ఐదు రోజుల సీబీఐ కస్టడీని విధించింది ఓ ప్రత్యేక న్యాయస్థానం. ఆదివారం మనీశ్​ సిసోడియాను సీబీఐ అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే.

మనీశ్​ సిసోడియా
మనీశ్​ సిసోడియా (PTI)

Manish Sisodia arrest : ఢిల్లీ లిక్కర్​ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్​ అయిన డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియాకు ఐదు రోజుల రిమాండ్​ను విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఫలితంగా.. మార్చ్​ 4వ తేదీ వరకు మనీశ్​ సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

స్కామ్​ జరిగిందా?

2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్​ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మద్యం విధానాన్ని కొట్టివేశారు. కాగా ఈ కేసులో సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం దాదాపు 8 గంటల పాటు సిసోడియాను విచారించింది సీబీఐ. సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ ఆయన్ని ఆదివారం అరెస్ట్​ చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరిచింది.

Manish Sisodia CBI custody : సోమవారం ఉదయం ఇరుపక్షాల వాదనలను విన్న స్పెషల్​ జడ్జీ ఎంకే నాగ్​పాల్​.. తన ఆదేశాలను రిజర్వ్​లో పెట్టారు. అనంతరం సాయంత్రం ఆదేశాలను ప్రకటించారు. మనీశ్​ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు.

వాదనలు ఇలా..

తమ ప్రశ్నలకు మనీశ్​ సిసోడియా తప్పించుకునే విధంగా సమాధానాలిచ్చినట్టు కోర్టుకు తెలిపింది సీబీఐ. లిక్కర్​ పాలసీ తొలి డ్రాఫ్ట్​లో లేని ఆరు వివాదాస్పద నిబంధనలను వివరించడంలో ఆయన విఫలమైయ్యారని పేర్కొంది. లిక్కర్​ లాబీ కోరికల మేరకు సవరణలు చేయడంతో కనీసం రూ. 100కోట్లు విలువ చేసే నిధులు అక్రమంగా చేతులు మారినట్టు ఆరోపించింది.

Manish Sisodia arrest news : వీటిపై మనీశ్​ సిసోడియా తరఫు న్యాయవాదులు మండిపడ్డారు. "సీబీఐ.. మనీశ్​ సిసోడియాపై ఒత్తిడి తీసుకొస్తోంది. అధికారుల అభిప్రాయాలకు తగ్గట్టు ఆయన జవాబులు చెప్పాలని భావిస్తున్నారు. అలా జరగకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు," అని సీనియర్​ న్యాయవాది దయన్​ కృష్ణన్​ అన్నారు.

ఈ క్రమంలోనే 2021 మేలో లెఫ్టినెంట్​ గవర్నర్​ ఈ లిక్కర్​ పాలసీపై సంతకం పెట్టారని గుర్తుచేశారు దయన్​ కృష్ణన్​. ఆయన చెప్పిన సవరణలకు అంగీకరించి, అమలు చేసిన తర్వాత కూడా సీబీఐ ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం అని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా నిరసనలు..

Manish Sisodia Delhi Liquor policy scam : మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా అరెస్ట్​ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆమ్​ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. ఢిల్లీ, బెంగళూరు, ఛండీగఢ్​, భోపాల్​తో పాటు ఇతర కీలక నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. రోడ్ల మీదకొచ్చి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆప్​ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని 10-15 బస్సులో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.

IPL_Entry_Point

టాపిక్