NTR in USA: అమెరికాలో ఎన్‌టీఆర్.. న్యూయార్క్ రెస్టారెంటులో సందడి చేసిన హీరో-ntr went to restaurant in usa and his post goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ntr Went To Restaurant In Usa And His Post Goes Viral

NTR in USA: అమెరికాలో ఎన్‌టీఆర్.. న్యూయార్క్ రెస్టారెంటులో సందడి చేసిన హీరో

Maragani Govardhan HT Telugu
Dec 26, 2022 12:07 PM IST

NTR in USA: జూనియర్ ఎన్‌టీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా న్యూయార్క్‌లోని జునూన్ అనే రెస్టారెంటుకు ఆయన వెళ్లారు. అంతేకాకుండా అక్కడ సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఎన్‌టీఆర్ ఫొటో వైరల్
ఎన్‌టీఆర్ ఫొటో వైరల్

NTR in USA: యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆచార్య డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా.. స్క్రిప్టు వర్క్‌ను పునరుద్ధరించడంతో ఆలస్యమైంది. దీంతో తారక్ లాంగ్ వెకేషన్‌కు ప్లాన్ చేశారు. ఇటీవలే ఆయన అమెరికా వెళ్లి అక్కడ ఫ్యామిలీతో నాణ్యమైన సమయాన్ని గడపుతున్నారు. తాజాగా ఆయన అక్కడకు సంబంధించిన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు.

ఇటీవలే జూనియర్ ఎన్‌టీఆర్ న్యూయార్క్‌‍లోని జునూన్ ఓ భారతీయ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ రెస్టాంరెంటులో వంటలను రుచి చూసిన ఈ యాక్టర్ అక్కడ చెఫ్‌లతో కలిసి ఓ ఫొటో దిగారు. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. అంతేకాకుండా ఆ స్టోరీ కింద క్యాప్షన్‌ను కూడా జోడించారు.

అంతర్జాతీయ పర్యటనలోనూ అత్యుత్తమ భారతీయ ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. న్యూయార్క్‌లోని జునూన్ అనే రెస్టారెంటులో స్పైసీగా అదిరిపోయే వంటలను రుచిచూశాను. అద్భుతంగా ఉంది. అని తారక్ తన స్టోరీకి క్యాప్షన్‌ను జత చేశారు. అంతేకాకుండా ఈ స్టార్ హీరోతో రెస్టారెంటు సిబ్బంది కలిసి ఫొటో దిగారు. గుబురు మీసాలు, గడ్డంతో ఎన్‌టీఆర్ ఫుల్ మాస్ లుక్‍‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా NTR30 అనే వర్కింగ్ టైటిల్‌లో తెరకెక్కనుంది. ఆచార్య పరాజయంపై ఈ సినిమాపై పడకూడదని.. తారక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నట్లు అంతర్గత వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. పాన్ఇండియా స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం తెలియజేయనుంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందుతొంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు తారక్.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్