Telangana : రూ. వంద కోట్లకుపైగా ఆస్తులు..! తెలంగాణలో 8 మంది రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు, ఒక్క చేవెళ్ల నుంచే ముగ్గురు..!-8 telangana candidates declare wealth over rs 100 crore each read this article for full details ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Telangana : రూ. వంద కోట్లకుపైగా ఆస్తులు..! తెలంగాణలో 8 మంది రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు, ఒక్క చేవెళ్ల నుంచే ముగ్గురు..!

Telangana : రూ. వంద కోట్లకుపైగా ఆస్తులు..! తెలంగాణలో 8 మంది రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు, ఒక్క చేవెళ్ల నుంచే ముగ్గురు..!

Lok Sabha elections in Telangana : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు సంపన్నులుగా ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆయా అభ్యర్థుల ఆస్తులు… వంద కోట్లకుపైగా చూపించారు.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు (PTI file photo)

Lok Sabha Elections in Telangana : తెలంగాణలో పోటీ చేస్తున్న పలువురి అభ్యర్థుల ఆస్తులు వంద కోట్లకు పైగా ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఎనిమిది మంది ఉన్నారు. ఆయా అభ్యర్థులు వారి కుటుంబ ఆస్తులతో కలిపి రూ.100 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. ఇందులో స్థిర, చర ఆస్తులు ఉన్నాయి.

రాష్ట్రంలోని చేవెళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy) పోటీ చేస్తున్నారు. మొత్తం 4,568 కోట్ల రూపాయల సంపదతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు.

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న రంజిత్ రెడ్డి ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం రూ.435.33 కోట్లతో రెండో ధనవంతుడిగా నిలిచారు. అప్పులు రూ.23 కోట్లుగా ఉన్నాయి. ఆయన కుటుంబానికి రూ.294.33 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, స్థిరాస్తుల విలువ రూ.141 కోట్లు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ కూడా అత్యధిక సంపద కలిగిన అభ్యర్థిగా ఉన్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రం నుంచి రిచెస్ట్ ఎంపీ అభ్యర్థుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం సంపద రూ.228.46 కోట్లుగా ప్రకటించారు.

MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కె మాధవిలతా పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో ఉన్న ఆమె ఆస్తులు… మొత్తం రూ.218.38 కోట్లుగా ఉన్నాయి. రూ.27 కోట్ల వరకు అప్పులు కూడా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి సమీర్ వలీవుల్లాను కాంగ్రెస్ పోటీకి దింపిన సంగతి తెలిసిందే.

వంద కోట్లకుపైగా ఆస్తులను ప్రకటించిన అభ్యర్థులు వీరే…

  • ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోటీ చేస్తున్న నామా నాగేశ్వర్‌రావు నికర సంపద రూ.155.89 కోట్లుగా ప్రకటించారు.
  • భువనగిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్యామ మల్లేశ్ రూ. 145.33 కోట్ల ఆస్తుల(కుటుంబ సభ్యులతో కలిపి)ను కలిగి ఉన్నారు.
  • నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అర్వింద్… మొత్తం నికర ఆస్తుల విలువ 109.89 కోట్లుగా ప్రకటించారు. మొత్తం అప్పుల విలువ రూ.30.67 కోట్లుగా ఉంది.
  • జహీరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీబీ పాటిల్ ఆస్తులు రూ. 151 కోట్లుగా ఉంది.
  • కంచర్ల కృష్ణారెడ్డి, గాలి అనిల్ కుమార్ రూ. 50 కోట్లకుపైగా ఆస్తులు కలిగి ఉన్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ నాలుగు సీట్లు గెలుచుకుంది. ఒక స్థానంలో MIM గెలవగా.. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.