Mahindra & Mahindra SUV's : రికార్డు స్థాయి ఎస్​యూవీలను విక్రయించిన ఎం అండ్​ ఎం!-mahindra and mahindra sells 36thouand suvs in march see full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra & Mahindra Suv's : రికార్డు స్థాయి ఎస్​యూవీలను విక్రయించిన ఎం అండ్​ ఎం!

Mahindra & Mahindra SUV's : రికార్డు స్థాయి ఎస్​యూవీలను విక్రయించిన ఎం అండ్​ ఎం!

Sharath Chitturi HT Telugu
Apr 03, 2023 01:41 PM IST

Mahindra & Mahindra SUV sales : ఎస్​యూవీ సేల్స్​ విషయంలో ఎం అండ్​ ఎం దూసుకెళుతోంది. సంస్థ చరిత్రలోనే తొలిసారిగా.. గతనెలలో భారీ మొత్తంలో ఎస్​యూవీలను విక్రయించింది.

రికార్డు స్థాయి ఎస్​యూవీలను విక్రయించిన ఎం అండ్​ ఎం!
రికార్డు స్థాయి ఎస్​యూవీలను విక్రయించిన ఎం అండ్​ ఎం! (HT AUTO)

Mahindra & Mahindra SUV sales : 2023 ఆర్థిక ఏడాదిలో చివరి నెలైన మార్చ్​లో 35,976 ఎస్​యూవీలను విక్రయించినట్టు దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మహీంద్రా అండ్​ మహీంద్రా ప్రకటించింది. ఫలితంగా 31శాతం వృద్ధి సాధించినట్టు పేర్కొంది. సంస్థ చరిత్రలో ఇదే అత్యధికం అని స్పష్టం చేసింది. మొత్తం మీద మార్చ్​ నెలలో 66,091 యూనిట్లను సేల్​ చేసినట్టు పేర్కొంది. ఈ విషయంలో ఎన్నడూ లేనంతగా, 21శాతం వృద్ధిని నమోదుచేసినట్టు వెల్లడించింది.

ఎస్​యూవీలకు విపరీతమైన డిమాండ్​..!

2020లో అప్డేటెడ్​ థార్​ను లాంచ్​ చేసినప్పటి నుంచి మహీంద్రా అండ్​ మహీంద్రా దశ తిరిగిపోయింది! ఎక్స్​యూవీ700, బోలేరో నియో, స్కార్పియో- ఎన్​ వంటి మోడల్స్​తో కస్టమర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది ఈ సంస్థ. "ఎస్​యూవీ అంటే.. ఎం అండ్​ ఎం సంస్థే" అన్నంత రేంజ్​లో గుర్తింపు తెచ్చుకుంది.

ఎం అండ్​ ఎం ఎస్​యూవీలకు విపరీతమైన డిమాండ్​ లభిస్తుండటంతో వెయిటింగ్​ పీరియడ్​ కూడా అధికంగానే ఉంటోంది. కొన్ని మోడల్స్​కు ఏకంగా 18నెలల వెయిటింగ్​ పీరియడ్​ నడుస్తోంది. డిమాండ్​ను అందుకునేందుకు ప్రొడక్షన్​ కెపాసిటీతో పాటు సిబ్బంది షిఫ్ట్​లను కూడా పెంచింది సంస్థ.

M&M march sales data : గత నెలలో 2,115 వాహనాలను ఎగుమతి చేసిన ఎం అండ్​ ఎం.. దేశీయ మార్కెట్​లో 5,697 3 వీలర్స్​ను విక్రయించింది.

అన్ని మోడల్స్​కు మంచి డిమాండ్​ లభిస్తుండటంపై మహీంద్రా అండ్​ మహీంద్రా హర్షం వ్యక్తం చేసింది.

"పోర్ట్​ఫోలియోలోని అన్ని మోడల్స్​కు మంచి డిమాండ్​ దక్కుతుండటం సంతోషకర విషయం. 2023 మార్చ్​లో 31శాతం వృద్ధితో మా ఎస్​యూవీ బిజినెస్​ పెరిగింది. ఇది ఆల్​టైమ్​ హై. ఎఫ్​వై23లో మా ఓవరాల్​ గ్రోత్​ 60శాతంగా నమోదైంది," అని ఎం అండ్​ ఎం ఆటోమొబైల్​ డివిజన్​ ప్రెసిడెంట్​ వీజయ్​ నాక్రా తెలిపారు.

ఇక ఈవీలపై ఫోకస్​..!

M&M SUV sales : ఎస్​యూవీలపై ఇంతకాలం ఫోకస్​ చేసిన ఎం అండ్​ ఎం.. ఇప్పుడు ఈవీలపైనా దృష్టిసారించింది. దేశ ఈవీ సెగ్మెంట్​లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్​కు ధీటుగా నిలిచేందుకు గట్టి పోర్ట్​ఫోలియోను సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఇటీవలే మార్కెట్​లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య లాంచ్​ అయిన ఈ మోడల్​కి మార్కెట్​లో అదిరిపోయే డిమాండ్​ లభిస్తుండటం విశేషం. ఎక్స్​యూవీ400కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం