AP Weather Latest Update: నైరుతి బంగాళాఖాతంలో డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 08.30 గంటలకు అల్పపీడనం ఏర్పడింది. దీని అనుభంద ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని ఐఎండి అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజులలో అల్పపీడనం బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశముందని అంచనా వేస్తున్నారు.