అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్ యోజన పథకాన్ని ప్రారంభించింది.అన్ ఆర్గనైజ్డ్ సెక్టార్ లోని కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈ-శ్రమ్ పోర్టల్ను ఏర్పాటు చేసింది. ఈ-శ్రమ్ పోర్టల్ ప్రధాన లక్ష్యం అసంఘటిత రంగాల్లోని కార్మికుల విస్తృత డేటాబేస్ ను రూపొందించి, వారికి అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం. అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కేంద్రం e-Shram కార్డు అందిస్తుంది. ఈ కార్డుతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
ఈ-శ్రమ్ కార్డు పొందిన కార్మికులు 60 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్, మరణాంతరం బీమా, వైకల్యం చెందితే ఆర్థిక సహాయంతో సహా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ-శ్రమ్ పోర్టల్ eshram.gov.in ద్వారా అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ కార్డును ఆన్ లైన్ లో పొందవచ్చు.