కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న వారందరికి అలర్ట్! నవంబర్ చివరి లోపు వార్షిక జీవిత ధ్రువీకరణ పత్రాన్ని కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు.
80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు అక్టోబర్ 1 నుంచి తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.
జీవన్ ప్రమాణ్ అనేది పెన్షన్ అథారిటీ ముందు అతను /ఆమె జీవించి ఉన్నారని నిరూపించడానికి పెన్షనర్ల కోసం ఐటి చట్టం-గుర్తింపు పొందిన ఆధార్ ఆధారిత, బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్.
సాధారణంగా వార్షిక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేది నవంబర్ 30. ప్రభుత్వం పొడిగించకపోతే ఇదే చివరి తేది అవుతుంది.
80 ఏళ్లు పైబడిన సీనియర్ పెన్షనర్లు 2024 అక్టోబర్ 1న లైఫ్ సర్టిఫికేట్ సమర్పించినా అది వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు వర్తిస్తుంది.
లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ చెల్లింపులు ఆగిపోతాయి!
అయితే ఆ తర్వాతి నెలలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తే పెన్షన్ చెల్లింపులు పునఃప్రారంభమవుతాయని, అప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ పెన్షనర్ కు కూడా చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ మూడేళ్లలోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు.
మూడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే, తగిన ప్రక్రియ ప్రకారం సీపీఏఓ ద్వారా కాంపిటెంట్ అథారిటీ మంజూరు చేసిన తరువాత పెన్షన్ ప్రారంభించడం జరుగుతుంది.
సంబంధిత కథనం
టాపిక్