ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గత నెలలో నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ గడువు సెప్టెంబర్ 9తో పూర్తి కావాల్సి ఉంటుంది. కానీ అధికారులు సెప్టెంబర్ 16వ తేదీ వరకు గడువు పొడిగించారు. అంటే ఈ గడువు రేపటితో పూర్తి కానుంది.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా…. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 488 పోస్టుల భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://dme.ap.nic.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల చాలా జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అభ్యర్థులకు మరో అవకాశంగా దరఖాస్తు గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ - https://dmeaponline.com/
దేశవ్యాప్తంగా ఉన్న 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ వివరాలను ప్రకటించింది. ఇందులో భాగంగా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను రిక్రూట్ చేయనుంది. డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేయటంతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు.
క్లస్టర్ల వారీగా ఈ పోస్టులను రిక్రూట్ చేస్తారు. CLUSTER 6లో చూస్తే హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ (ఆర్కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి.