Visakha Train Timings: విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకునే రైళ్లు గమ్యస్థానాన్ని చేరుకునే సమయాల్లో మార్పులు చేసినట్టు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణ సమయంలో మార్పులను ప్రయాణికులు గమనించాలని కోరారు.
● అక్టోబర్ 15వ తేదీ నుంచి న్యూఢిల్లీ-విశాఖపట్నం(20806) ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖకు తెల్లవారు 4.10 గంటలకు బదులుగా 4.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 22 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం(22848) వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారు 5 గంటలకు బదులుగా 5.10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి హైదరాబాద్-విశాఖపట్నం (12728) గోదావరి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారు 5.45 గంటలకు బదులుగా 5.55 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి కోర్బా-విశాఖపట్నం(18517) ఎక్స్ప్రెస్ ఉదయం 6.25 గంటలకు బదులుగా 6.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్15 నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం (12740) గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ ఉదయం 7.40 గంటలకు బదులుగా 7.50 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి మచిలీపట్నం-విశాఖపట్నం (17219) ఎక్స్ప్రెస్ ఉదయం 8.10 గంటలకు బదులుగా 8.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి నాందేడ్ -విశాఖపట్నం (20812) వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 9.10 గంటలకు బదులుగా 9.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి బ్రహ్మపూర్-విశాఖపట్నం (08531) పాసింజర్ స్పెషల్ ఉదయం 9.20 గంటలకు బదులుగా 9.30 గంటలకు చేరుకుంటుంది.
●అక్టోబర్ 15 నుంచి కాకినాడ పోర్ట్-విశాఖపట్నం (17267) ఎక్స్ప్రెస్ ఉదయం 9.30 గంటలకు బదులుగా 9.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 19 నుంచి భగత్ కి కోటి-విశాఖపట్నం (18574) వీక్లీ ఎక్స్ప్రెస్ ఉదయం 9.50 గంటలకు బదులుగా 10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి భవానిపట్న-విశాఖపట్నం (08503) పాసింజర్ స్పెషల్ ఉదయం 10 గంటలకు బదులుగా 10.10 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి గాంధీదాం-విశాఖపట్నం (20804) వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉదయం 10.10 గంటలకు బదులుగా 10.20 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి దుర్గ్-విశాఖపట్నం (18529) ఎక్స్ప్రెస్ ఉదయం 10.20 గంటలకు బదులుగా 10.30 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి తిరుపతి-విశాఖపట్నం (22708) డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఉదయం 10.30 గంటలకు బదులుగా 10.40 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి లోకమాన్యతిలక్ టెర్మినస్-విశాఖపట్నం (18520) ఎల్టీటీ ఎక్స్ప్రెస్ ఉదయం 10.40 గంటలకు బదులుగా 10.50 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 20 నుంచి హజరత్ నిజాముద్దీన్-విశాఖపట్నం (12804)స్వర్ణజయంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 2.15 గంటలకు బదులుగా 2.45 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి రాయ్పూర్-విశాఖపట్నం (08527) పాసింజర్ స్పెషల్ రాత్రి 6.40 గంటలకు బదులుగా 7 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి కిరండూల్-విశాఖపట్నం (08552) పాసింజర్ స్పెషల్ రాత్రి 8.20 గంటలకు బదులుగా 8.45 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి గుణుపూర్-విశాఖపట్నం (08521) పాసింజర్ స్పెషల్ రాత్రి 8.45 గంటలకు బదులుగా 9 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 15 నుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ప్రెస్ రాత్రి 11.31 గంటలకు బదులుగా 11.35 గంటలకు చేరుకుంటుంది.
● అక్టోబర్ 18 నుంచి కొల్లాం-విశాఖపట్నం (18568) వీక్లీ ఎక్స్ప్రెస్ రాత్రి 11.40 గంటలకు బదులుగా 11.45 గంటలకు చేరుకుంటుంది.