తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Bail: ఢిల్లీ కోర్టులో బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం..

Mlc Kavitha Bail: ఢిల్లీ కోర్టులో బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం..

Sarath chandra.B HT Telugu

08 April 2024, 11:44 IST

    • Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది.  కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలన్న కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 
బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం (HT_PRINT)

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ  Delhi liquor policyవ్యవహారంలో అరెస్టైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో చుక్కైదురైంది. ఢిల్లీ మద్యం విక్రయాలకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ Delhi liquor scam రూపకల్పనలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనే అభియోగాలతో ఈడీ ఎమ్మెల్సీMlc Kavitha  కవితను అరెస్ట్ ఛేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ నిరాకరించింది.

ట్రెండింగ్ వార్తలు

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

16 ఏళ్ల కుమారుడికి పరీక్షలు రాయడంతోపాటు మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని మహిళా నిందితులను బెయిల్‌పై విడుదల చేసేందుకు అనుకూలమైన నిబంధనను పేర్కొంటూ కవిత దరఖాస్తును సమర్పించారు. గత వారం ఏప్రిల్ 4న తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారం ఆమె బెయిల్ దరఖాస్తును తోసిపుచ్చారు.

ఏప్రిల్ 4న జరిగిన విచారణలో, సాధారణ కఠినమైన బెయిల్ షరతులను మినహాయించి మహిళా నిందితులను బెయిల్‌పై విడుదల చేయడానికి కోర్టును అనుమతించే మనీలాండరింగ్ నిరోధక (పిఎంఎల్‌ఎ) సెక్షన్ 45 ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపున న్యాయవాదులు వాదించారు.

కుమారుడు పరీక్షలకు హాజరవుతున్నందున పరీక్ష Examsల సమయంలో తల్లిగా భావోద్వేగ మద్దతు అవసరమని అభ్యర్థిస్తూ బెయిల్‌ కోసం దరఖాస్తు చేశారు.

పిఎంఎల్‌ఎలోని సెక్షన్ 45 ప్రకారం మహిళలకు మినహాయింపు ఉందని, ఆ నిబంధన మహిళల కోసం ఉద్దేశించబడిందని, కవిత ప్రముఖ రాజకీయ నాయకురాలు కాబట్టి ఆమెకు ఆ సెక్షన్‌ వర్తించదని ED బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. కవిత కుమారుడి సంరక్షణ చూడ్డానికి ఇతర కుటుంబ సభ్యులు అంతా అందుబాటులో ఉన్నారని వివరించింది.

లిక్కర్ పాలసీ వ్యవహారంలో లభ్యమైన సాక్ష్యాధారాలు, కీలక పత్రాలు మరియు వాట్సాప్ చాట్‌ల ఆధారంగా ఆమె మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకున్నారని, లంచం తీసుకోవడంలో ఆమె ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, ఈ కేసులో ఆమె ప్రధాన నిందితుల్లో ఒకరని ED నిర్ధారించింది. కవిత తన మొబైల్ ఫోన్‌లోని డేటాతో సహా సాక్ష్యాలను ధ్వంసం చేసిందని, ఫోరెన్సిక్ నివేదికల ద్వారా ఇది స్పష్టంగా ఉందని ఈడీ న్యాయవాదులు పేర్కొన్నారు.

కవిత కొడుకు పరీక్షలకు సంబంధించి, పన్నెండు పేపర్లలో ఏడు పేపర్లు ఇప్పటికే పూర్తయ్యాయని, 16 ఏళ్ల బాలుడికి కుటుంబ సభ్యులు ఉన్నారని న్యాయవాది హొస్సేన్ ఎత్తి చూపారు. ఏప్రిల్ 20న వాదనలు వినడానికి జాబితా చేయబడిన కోర్టు ముందుకు ఆమె రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును కూడా పంపుతున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మార్చి 15న కవితను ED అరెస్టు చేసింది, మార్చి 26 నుండి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇప్పటివరకు దాఖలు చేసిన ఆరు ED ఛార్జ్ షీట్‌లలో దేనిలోనూ కవిత అధికారికంగా అభియోగాలు మోపలేదు. , ఆమె కోర్టు పత్రాలలో ముఖ్యమైన వ్యక్తిగా మాత్రమే పేర్కొన్నారు.

"సౌత్ గ్రూప్" అని పిలువబడే థకంలో ఆమె ప్రమేయం ఉందని ఆరోపించిన ఈడీ, కవితపై ఉన్న ప్రాథమిక ఆరోపణ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులకు రిటైల్ జోన్‌లను కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వడానికి, ప్రతిఫలంగా రూ. 100 కోట్ల విలువైన ముడుపులును చెల్లించారని ఈడీ ఆరోపిస్తోంది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి గత నెలలో కవితకు సమన్లు జారీ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా కవితపై ఆరోపణలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొంది. సిబిఐ విచారణకు సమన్లు ఉన్నప్పటికీ, కవిత సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపును ఉదహరిస్తూ సీబీఐ ముందు హాజరు కాలేదు.

జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను విచారించేందుకు గత వారం సీబీఐ కోర్టు అనుమతి కూడా పొందింది. తన వాదన కూడా వినిపించేంత వరకు ఈ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కోరుతూ కవిత కూడా కోర్టును ఆశ్రయించారు.

ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ఢిల్లీ ప్రభుత్వం యొక్క 2021-22 ఎక్సైజ్ పాలసీని కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి. ఆప్‌ పాలనలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫార్సు చేయడంతో చివరికి ఢిల్లీ లిక్కర్ పాలసీని రద్దు చేశారు.

తదుపరి వ్యాసం