తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Harbhajan On Dhoni: ధోనీ ఆ రోజు ఏడ్చాడు.. అతన్ని ఎప్పుడూ అలా చూడలేదు: హర్భజన్

Harbhajan on Dhoni: ధోనీ ఆ రోజు ఏడ్చాడు.. అతన్ని ఎప్పుడూ అలా చూడలేదు: హర్భజన్

Hari Prasad S HT Telugu

23 May 2023, 16:05 IST

    • Harbhajan on Dhoni: ధోనీ ఆ రోజు ఏడ్చాడు.. అతన్ని ఎప్పుడూ అలా చూడలేదంటూ హర్భజన్ సింగ్ ఎవరికీ తెలియని ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ కామెంటరీలో భాగంగా భజ్జీ ఆ ఎమోషనల్ మూమెంట్ గురించి గుర్తు చేసుకున్నాడు.
ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ (PTI)

ఎమ్మెస్ ధోనీ

Harbhajan on Dhoni: ధోనీ చాలా కూల్.. అతనిలో ఎలాంటి భావోద్వేగాలు కనిపించవు అని అందరూ అంటుంటారు. కానీ అతడు చాలా ఎమోషనల్ అని, ఆ రోజు ధోనీ ఏడవడం తాను చూశానని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. ఇది 2018 ఐపీఎల్ సందర్భంగా జరిగినట్లు భజ్జీ చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసిన ఓ వీడియోలో సాటి కామెంటేటర్లతో హర్భజన్ దీని గురించి మాట్లాడటం చూడొచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

2018లో రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టింది. ఆ రెండేళ్లూ కొత్త టీమ్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన ధోనీ.. తిరిగి సీఎస్కేలోకి వచ్చాడు. ఇదే అతన్ని ఎమోషనల్ చేసింది. ఆ సందర్భంగానే ధోనీ కంటతడి పెట్టినట్లు భజ్జీ తెలిపాడు. మగవాళ్లు ఏడవరని అందరూ అంటుంటారని, కానీ ఆ రోజు ధోనీ ఏడవడం తాను చూశానని చెప్పాడు.

"నేను మీతో ఓ స్టోరీ పంచుకోవాలని అనుకుంటున్నాను. 2018లో రెండేళ్ల నిషేధం తర్వాత సీఎస్కే తిరిగి ఐపీఎల్ కు వచ్చిన సందర్భంగా టీమ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సాధారణంగా మగవాళ్లు ఏడవరని అంటుంటారు. కానీ ధోనీ మాత్రం ఆ రాత్రి ఏడ్చాడు. అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదు. అంతేకదా ఇమ్రాన్" అంటూ పక్కనే ఉన్న ఇమ్రాన్ తాహిర్ తో భజ్జీ అన్నాడు.

దీనికి తాహిర్ స్పందిస్తూ.. "అవును, నిజమే. నేను కూడా అక్కడ ఉన్నాను. ధోనీకి అది చాలా ఎమోషనల్ మూమెంట్. అతన్ని అలా చూసిన తర్వాత ఈ జట్టుతో అతనికి ఎలాంటి బంధం ఉందో అర్థమైంది. జట్టును తన కుటుంబంగా అతడు భావిస్తాడు. మా అందరికీ అది చాలా ఎమోషనల్ మూమెంట్" అని హర్భజన్ స్పష్టం చేశాడు.

ఆ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తమ మూడో ట్రోఫీ గెలిచింది. ఆ తర్వాత జట్టుతో కలిసి ధోనీ సెలబ్రేట్ చేసుకోకుండా హోటల్ కు వెళ్లిపోయాడని, అదేంటని అడిగితే.. తన పని అంతటితో ముగిసిందని చెప్పాడని హర్భజన్ తెలిపాడు. 2018లో దాదాపు టీమ్ మొత్తం 30 ఏళ్లు పైబడిన వాళ్లే ఉండటంతో ముసలోళ్ల టీమ్ అని సీఎస్కేను ట్రోల్ చేసినా.. ఆ టీమ్ టైటిల్ గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది.

తదుపరి వ్యాసం