తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Bangladesh U19 Team Met Virat Kohli: విరాట్‌ కోహ్లిని కలిసిన బంగ్లాదేశ్‌ అండర్‌ 19 టీమ్‌ సభ్యులు

Bangladesh U19 Team Met Virat Kohli: విరాట్‌ కోహ్లిని కలిసిన బంగ్లాదేశ్‌ అండర్‌ 19 టీమ్‌ సభ్యులు

Hari Prasad S HT Telugu

21 December 2022, 21:21 IST

    • Bangladesh U19 Team Met Virat Kohli: విరాట్‌ కోహ్లిని కలిశారు బంగ్లాదేశ్‌ అండర్‌ 19 టీమ్‌ సభ్యులు. రెండో టెస్ట్‌ కోసం టీమిండియా ప్రాక్టీస్‌ చేస్తుండగా.. ఈ యంగ్‌ క్రికెటర్లు అక్కడికి వచ్చారు.
బంగ్లాదేశ్ అండర్19 టీమ్ తో విరాట్ కోహ్లి
బంగ్లాదేశ్ అండర్19 టీమ్ తో విరాట్ కోహ్లి (BCCI Twitter)

బంగ్లాదేశ్ అండర్19 టీమ్ తో విరాట్ కోహ్లి

Bangladesh U19 Team Met Virat Kohli: ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ క్రికెటర్‌కు అయినా విరాట్‌ కోహ్లి ఓ ఇన్‌స్పిరేషన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతన్ని కలవాలని, బ్యాటింగ్‌ మెళకువలు తెలుసుకోవాలని కోరుకోని యువ క్రికెటర్‌ ఉండడు. ఇప్పుడా అరుదైన అవకాశం బంగ్లాదేశ్‌ అండర్‌ 19 టీమ్‌ సభ్యులకు దక్కింది.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

బుధవారం (డిసెంబర్‌ 21) షేర్‌-ఇ-బంగ్లా నేషనల్‌ స్టేడియంలో టీమిండియా ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఈ యువ క్రికెటర్లు అక్కడికి వచ్చారు. తమ అభిమాన క్రికెటర్‌ విరాట్ కోహ్లిని చూడగానే ఎంతో ఆనందం వ్యక్తం చేసిన వాళ్లు.. అతనితో కలిసి ఉత్సాహంగా ఫొటోలకు పోజులిచ్చారు. సాధారణ అభిమానులు సెల్ఫీలు అడిగినా కాదనని విరాట్‌.. బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్ల కోరికను మన్నించాడు.

కోహ్లితోపాటు రిషబ్ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌లతోనూ వాళ్లు ఫొటోలకు పోజులిచ్చాడు. ఈ ఫొటోలను బీసీసీఐ బుధవారం తన ట్విటర్‌లో షేర్‌ చేసుకుంది. ఇన్‌స్పైరింగ్‌ జనరేషన్‌ నెక్ట్స్‌.. బంగ్లాదేశ్‌ అండర్‌ 19 టీమ్‌ విరాట్‌ కోహ్లి, పంత్‌, కుల్దీప్‌లను కలిసి మాట్లాడింది అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలను క్రికెట్‌ బోర్డు పోస్ట్‌ చేసింది.

కోహ్లితో ఫొటో దిగే ఛాన్స్‌ రావడంతో బంగ్లాదేశ్‌ అండర్‌ 19 క్రికెటర్లు తెగ సంతోషించారు. తన నెట్‌ ప్రాక్టీస్‌ ముగిసిన తర్వాత అలాగే యువ క్రికెటర్లతో విరాట్‌ ఫొటోలకు పోజులిచ్చాడు. గురువారం (డిసెంబర్‌ 22) నుంచి ఇండియా, బంగ్లాదేశ్‌ మధ్య మీర్పూర్‌లో రెండో టెస్ట్‌ జరగనుంది.

ఇప్పటికే తొలి టెస్ట్‌ గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌ కూడా గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలన్న పట్టుదలతో ఉంది. అయితే తొలి టెస్ట్‌ గెలిచినా విరాట్‌ కోహ్లి మాత్రం టెస్టుల్లో ఫామ్‌లోకి రాలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 1 పరుగుకే ఔటైన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులతో ఉండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశారు.

తదుపరి వ్యాసం