తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xe Variant | భారత్​లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్​.. కేసులు మళ్లీ పెరుగుతాయా?

XE variant | భారత్​లోకి ప్రవేశించిన కొత్త వేరియంట్​.. కేసులు మళ్లీ పెరుగుతాయా?

HT Telugu Desk HT Telugu

06 April 2022, 17:43 IST

    • బ్రిటన్​లో కరోనా కొత్త వేరియంట్​ XE ని ఇటీవలే కనుగొన్నారు. తాజాగా.. ముంబైలో ఎక్స్​ఈ వేరియంట్​కు సంబంధించి ఒక కేసు నమోదైంది.
కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు (HT/file)

కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

XE variant in india | దేశంలోకి కొత్త కొవిడ్​ వేరియంట్​ XE ప్రవేశించింది. మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం ఎక్స్​ఈ వేరియంట్​కు సంబంధించిన తొలి కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సేకరించిన 376 నమూనాల్లో.. ఒకరికి ఎక్స్​ఈ వేరియంట్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

ఈ 376మందిలో 230మంది ముంబైకి చెందినవారే ఉన్నారు. వారిలో 228మందికి ఒమిక్రాన్​ సోకినట్టు తేలిసింది. కాగా.. ఒకరికి కప్పా వేరియంట్​, మరొకరికి ఎక్స్​ఈ వేరియంట్​ సోకినట్టు పరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. అయితే ఎక్స్​ఈ వేరియంట్​ సోకిన వ్యక్తి ఆరోగ్యంగానే ఉన్నట్టు.. ఎలాంటి తీవ్ర లక్షణాలు లేవని బృహన్​ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ వెల్లడించింది.

ఈ 230మందిలో 21మంది ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 12మంది టీకా తీసుకోలేదు, మరో తొమ్మిది మందికి రెండు డోసులు తీసుకున్నా వైరస్​ సోకింది.

ప్రమాదరకమా?

XE variant covid | కాగా.. ఈ ఎక్స్​ఈ వేరియంట్​ను బ్రిటన్​లో ఇటీవలే ట్రేస్​ చేశారు. ఒమిక్రాన్​లోని రెండు ఉప వేరియంట్​లు బీఏ1. బీఏ2ల కలయికతో ఈ వేరియంట్​ ఉద్భవించిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. ఇది ఒమిక్రాన్​ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు.

టాపిక్

తదుపరి వ్యాసం