Crime news : భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!
16 February 2024, 12:45 IST
- Man Parades Wife's Severed Head : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. అనంతరం.. ఆమె మొండాన్ని రోడ్డు మీద ఊరేగించాడు! పశ్చిమ్ బెంగాల్లో జరిగింది ఈ ఘటన.
భార్య తల నరికి.. మొండాన్ని ఊరేగించిన భర్త!
Man kills wife in West Bengal : పశ్చిమ్ బెంగాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. తన భార్య తల నరికి, మొండాన్ని ఊరేగించాడు! ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఇదీ జరిగింది..
పశ్చిమ్ బెంగాల్ పూర్బ్ మేదినీపూర్ జిల్లాలో ఫిబ్రవరి 14న జరిగింది ఈ ఘటన. ఆ రోజు.. వాలెంటైన్స్ డే, సరస్వతి పూజ కలిసి వచ్చాయి. ఫలితంగా.. ఆ ప్రాంతంలోని మార్కెట్లు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.
Man parades wife's head in Bengal : ఇంతలో.. ఒంటి నిండా రక్తంతో ఉన్న 40ఏళ్లు గౌతమ్ గుచైత్ అనే వ్యక్తి.. ఓ మొండాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చాడు. వెంటనే గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. బస్స్టాప్ వరకు వెళ్లి, రక్తపు చేతులతో మొండాన్ని పట్టుకుని అటు, ఇటు తిరగడం మొదలుపెట్టాడు. అది చూసిన స్థానికులు హడలెత్తిపోయారు. కొందరు.. ఆ దృశ్యాలను తమ ఫొన్లలో చిత్రీకరించారు.
మహిళ మొండాన్ని పట్టుకుని ఓ వ్యక్తి రోడ్డు మీద బీభత్సం సృష్టిస్తున్నాడని.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. ఘటనపై సమాచారం అందుకున్న గంటకు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. నిందితుడిని అరెస్ట్ చేశారు.
West Bengal crime news : మరోవైపు.. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. 40ఏళ్ల గౌతమ్ పట్టుకున్న మొండెం తన భార్య ఫూల్రాణి గుచైత్ది. వారి మధ్య గత కొన్నేళ్లు కుటుంబ సమస్యలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న అవి తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో.. భార్యని అతి కిరాతకంగా చంపేశాడు గౌతమ్. అనంతరం.. మొండాన్ని పట్టుకుని ఊరేగించాడు.
మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా.. నిందితుడి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేశారు. అయితే.. తమ బిడ్డ మానసిక ఆరోగ్యం బాగోలేదని, నిందితుడి తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
Man kills wife : రోడ్డు మీద భార్య మొండాన్ని పట్టుకుని ఊరేగించిన వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
3ఏళ్ల క్రితం..!
మూడేళ్ల క్రితం.. కోల్కతాలోని అలిపోర్ జూలోని సింహ బోను ముందుకు ఓ వ్యక్తి దూకాడు. ఆ ఘటన అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. 14 అడుగుల గోడని దూకి, రెండు ఫెన్స్లను దాటుకుని బోను దగ్గరికి వెళ్లాడు ఆ వ్యక్తి. అనంతరం సింహం ఉన్న డెన్ వరకు వెళ్లాడు. ఆ వ్యక్తి.. ఇప్పుడు భార్య తల నరికి, మొండాన్ని ఊరేగించిన వ్యక్తి ఒకరే!