తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hotel Manager Kills Wife : లవర్​ గురించి తెలిసిపోయిందని.. భార్యను చంపేసిన భర్త!

Hotel manager kills wife : లవర్​ గురించి తెలిసిపోయిందని.. భార్యను చంపేసిన భర్త!

Sharath Chitturi HT Telugu

21 January 2024, 11:55 IST

    • Hotel manager kills wife : లవర్​ గురించి తెలిసిపోయిందని, ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. సౌత్​ గోవాలో జరిగింది ఈ ఘటన.
లవర్​ గురించి తెలిసిపోయిందని.. భార్యను చంపేసిన భర్త!
లవర్​ గురించి తెలిసిపోయిందని.. భార్యను చంపేసిన భర్త!

లవర్​ గురించి తెలిసిపోయిందని.. భార్యను చంపేసిన భర్త!

Hotel manager kills wife in Goa : గోవాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన లవ్​ ఎఫైర్ గురించి తెలిసిపోయిందన్న కారణంతో.. ఓ లగ్జరీ హోటల్​ మేనేజర్​, అతని భార్యను చంపేశాడు. అనంతరం.. ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు.

ట్రెండింగ్ వార్తలు

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

ఇదీ జరిగింది..

29ఏళ్ల గౌరవ్ కతియార్​​.. సౌత్​ గోవా కోల్వాలోని మారియట్​ ఇంటర్నేషనల్​ హోటల్​లో మేనేజర్​గా పనిచేస్తున్నాడు. కాగా.. లక్నోవాసి గౌరవ్​కు ఏడాది క్రితం దీక్షా గంగ్వార్​తో పెళ్లి జరిగింది. కానీ వారి మధ్య బంధం సరిగ్గా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. మరో మహిళతో గౌరవ్​ ప్రేమలో ఉన్నట్టు దీక్షకు తెలిసిందని సమాచారం. అనంతరం.. వారి మధ్య దూరం మరింత పెరిగింది.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంగా.. దీక్షను చంపేందుకు ప్లాన్​ చేశాడు గౌరవ్​. గత శుక్రవారం.. భార్యను కాబో డే రామ బీజ్​కు తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి బీచ్​ వరకు వెళ్లాడు. అక్కడ.. ఆమెను నీటిలో ముంచి చంపేశాడు. ఎవరు చూడలేదు, అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతను చేసిన తప్పు బయటపడటానికి ఎక్కువ సమయం పట్టలేదు.

Hotel manager kills wife : గౌరవ్​, తన భార్యను తీసుకుని బీచ్​ వరకు వెళ్లడాన్ని.. అక్కడే ఉన్న కొందరు టూరిస్ట్​లు చూశారు. గౌరవ్​, దీక్షా కలిసి నీటిలో దిగడాన్ని చూశారు. కొంతసేపటికి.. గౌరవ్​ ఒక్కడే, బీచ్​ నుంచి బయటకు వెళుతుండటాన్ని గమనించి, అనుమానం వ్యక్తం చేశారు. భార్యతో వచ్చిన గౌరవ్​.. సోలోగా బయటకు వెళుతుండటాన్ని వీడియో తీశారు. ఇంతలో.. గౌరవ్​ మళ్లీ బీచ్​ లోపలికి వెళ్లాడు. తన భార్య బతికే ఉందా? లేక మరణించిందా? అని చూసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఎలా తెలిసిందో కానీ.. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీక్షా మృతదేహాన్ని బీచ్​ నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టగా.. వ్యవహారం గౌరవ్​ వరకు వెళ్లింది. ఈ క్రమంలో చేసిన తప్పును చెప్పకుండా.. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించాడు గౌరవ్​. తన భార్య.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిందని చెప్పాడు.

Goa crime news : కాగా.. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. అదే సమయంలో.. ఆమె శరీరంపై కొన్ని మార్క్స్​ కనిపించాయి. ఎవరో గొంతు నులిమి చంపి ఉంటారని అనుమానించారు. అదే సమయంలో.. ఆ రోజు బీచ్​లో ఉన్న కొందరు టూరిస్ట్​లను విచారించారు పోలీసులు. గౌరవ్​పై వారికి ఉన్న అనుమానాన్ని చెబుతూ.. వారి తీసిన వీడియోను చూపించారు. గౌరవ్​ దొరికిపోయాడు.

గౌరవ్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. గౌరవ్​ నిజాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భార్యను చంపినట్టు, గౌరవ్​.. పోలీసులకు చెప్పాడని తెలుస్తోంది.

గౌరవ్​పై కేసు నమోదు చేసుకుని.. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వివరించారు.

తదుపరి వ్యాసం