Goa rape news: గోవాలో మహిళా టూరిస్ట్ పై అత్యాచారం
25 August 2023, 14:06 IST
Goa rape news: ఒక మహిళా టూరిస్ట్ పై అత్యాచారం జరిగిన ఘటన భారత్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23వ తేదీన పనాజీకి సమీపంలోని ఒక రిసార్ట్ లో గోవా చూడ్డానికి వచ్చిన ఒక మహిళపై గుజరాత్ కు చెందిన మరో టూరిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రతీకాత్మక చిత్రం
Goa rape news: ఒక మహిళా టూరిస్ట్ పై అత్యాచారం జరిగిన ఘటన భారత్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23వ తేదీన గోవా చూడ్డానికి వచ్చిన ఒక మహిళపై పనాజీకి సమీపంలోని అసనోరా గ్రామంలో ఉన్న ఒక రిసార్ట్ లో గుజరాత్ కు చెందిన మరో టూరిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ముందే పరిచయం..
నిందితుడిని గుజరాత్ కు చెందిన 47 సంవత్సరాల వయస్సు ఉన్న లక్ష్మణ్ షియర్ గా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి బాధితురాలితో గతంలోనే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక విమాన ప్రయాణం సందర్భంగా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఆ మహిళ వద్ద నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న లక్ష్మణ్ ఆమెతో తరచూ కాంటాక్ట్ లో ఉండేవాడు. ఆగస్టు 22వ తేదీన ఆమె గోవాకు వస్తోందని తెలుసుకున్న లక్ష్మణ్.. తాను కూడా గోవా వెళ్లాడు. పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో నార్త్ గోవాలో ఉన్న అసనోరా గ్రామంలోని ఒక రిసార్ట్ లో ఉన్నాడు. అనంతరం ఆ మహిళకు ఫోన్ చేసి తాను ఉంటున్న రిసార్ట్ చాలా బాగుందని, ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి అని, ఒకసారి చూడ్డానికి రావాలని కోరాడు. దాంతో, ఆగస్ట్ 23న ఆమె ఆ రిసార్ట్ కు ఒంటరిగా వెళ్ళింది. ఆమెను తన రూంకు తీసుకువెళ్లిన లక్ష్మణ్ ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానని బెదిరించాడు.
నిందితుడి అరెస్ట్
ఘటన జరిగిన మర్నాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని నార్త్ గోవాలోని మపుస పట్టణం సమీపంలోని త్రివియం గ్రామంలో ఉన్న రిసార్ట్ లో అరెస్ట్ చేశారు. బాధితురాలి వయస్సు, ఇతర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.