తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Goa Rape News: గోవాలో మహిళా టూరిస్ట్ పై అత్యాచారం

Goa rape news: గోవాలో మహిళా టూరిస్ట్ పై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

25 August 2023, 14:06 IST

  • Goa rape news: ఒక మహిళా టూరిస్ట్ పై అత్యాచారం జరిగిన ఘటన భారత్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23వ తేదీన పనాజీకి సమీపంలోని ఒక రిసార్ట్ లో గోవా చూడ్డానికి వచ్చిన ఒక మహిళపై గుజరాత్ కు చెందిన మరో టూరిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Goa rape news: ఒక మహిళా టూరిస్ట్ పై అత్యాచారం జరిగిన ఘటన భారత్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం గోవాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23వ తేదీన గోవా చూడ్డానికి వచ్చిన ఒక మహిళపై పనాజీకి సమీపంలోని అసనోరా గ్రామంలో ఉన్న ఒక రిసార్ట్ లో గుజరాత్ కు చెందిన మరో టూరిస్ట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

ముందే పరిచయం..

నిందితుడిని గుజరాత్ కు చెందిన 47 సంవత్సరాల వయస్సు ఉన్న లక్ష్మణ్ షియర్ గా గుర్తించారు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి బాధితురాలితో గతంలోనే పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక విమాన ప్రయాణం సందర్భంగా వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో ఆ మహిళ వద్ద నుంచి ఫోన్ నెంబర్ తీసుకున్న లక్ష్మణ్ ఆమెతో తరచూ కాంటాక్ట్ లో ఉండేవాడు. ఆగస్టు 22వ తేదీన ఆమె గోవాకు వస్తోందని తెలుసుకున్న లక్ష్మణ్.. తాను కూడా గోవా వెళ్లాడు. పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో నార్త్ గోవాలో ఉన్న అసనోరా గ్రామంలోని ఒక రిసార్ట్ లో ఉన్నాడు. అనంతరం ఆ మహిళకు ఫోన్ చేసి తాను ఉంటున్న రిసార్ట్ చాలా బాగుందని, ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి అని, ఒకసారి చూడ్డానికి రావాలని కోరాడు. దాంతో, ఆగస్ట్ 23న ఆమె ఆ రిసార్ట్ కు ఒంటరిగా వెళ్ళింది. ఆమెను తన రూంకు తీసుకువెళ్లిన లక్ష్మణ్ ఆమెను బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానని బెదిరించాడు.

నిందితుడి అరెస్ట్

ఘటన జరిగిన మర్నాడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని నార్త్ గోవాలోని మపుస పట్టణం సమీపంలోని త్రివియం గ్రామంలో ఉన్న రిసార్ట్ లో అరెస్ట్ చేశారు. బాధితురాలి వయస్సు, ఇతర వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

తదుపరి వ్యాసం