Accident to Vande Bharat express: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు యాక్సిడెంట్
06 October 2022, 15:55 IST
- Accident to Vande Bharat express: ఇటీవల భారత ప్రధాని ప్రారంభించిన సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు స్వల్ప ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ధ్వంసమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముందు భాగం
ప్రమాదంలో ధ్వంసమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ ముందు భాగం
Accident to Vande Bharat express: ముంబై నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ కు ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణిస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం గుజరాత్ లోని బాట్వా, మణినగర్ ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
Accident to Vande Bharat express: గేదెల గుంపు గుద్దుకుని..
ముంబై నుంచి బయల్దేరిన తరువాత, బాట్వా, మణి నగర్ మధ్య, మరి కాసేపట్లో అహ్మదాబాద్ చేరుకుంటుందనగా, ఈ ట్రైన్ పట్టాలపై వెళ్తున్న గేదెల గుంపును ఢీ కొట్టింది. దాంతో, ట్రైన్ ముందు భాగం కొద్దిగా ధ్వంసమైంది. వెంటనే రైలు సిబ్బంది ధ్వంసమైన ఆ భాగాన్ని తొలగించారు. అనంతరం, రైలు మళ్లీ కదిలింది. అత్యాధునిక సౌకర్యాలతో ఈ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ను రూపొందించారు. గత నెలలో ప్రధాని మోదీ ఈ ట్రైన్ ను ప్రారంభించి, కాసేపు ఈ రైలులో ప్రయాణించారు.