తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Supreme Court On Demonetisation : ‘నోట్ల రద్దు సరైనదే’- సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme court on demonetisation : ‘నోట్ల రద్దు సరైనదే’- సుప్రీంకోర్టు కీలక తీర్పు

02 January 2023, 11:56 IST

    • Supreme verdict court on demonetisation : నోట్ల రద్దు వ్యవహారంపై కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. కేంద్రం చేపట్టిన నోట్లరద్దు సరైనదే అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు (HT_PRINT)

సుప్రీంకోర్టు

Supreme verdict court on demonetisation : 2016 నవంబర్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైనదే అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ అనంతరం 4:1తో ఈ తీర్పును వెలువరించింది ఐదుగురు సభ్యుల ధర్మాసనం. ఆయా పిటిషన్లను కొట్టివేసింది.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

'అది సరైన నిర్ణయమే..'

నోట్ల రద్దు ప్రక్రియను కేంద్రమే మొదలుపెట్టిందన్న కారణంతో దానిని వ్యతిరేకించలేమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు ఇచ్చిన 52రోజుల గడువు కూడా సమంజసంగానే ఉందని అభిప్రాయపడింది.

Demonetisation Supreme court :  "నోట్ల రద్దు కోసం ఆర్​బీఐను కేంద్రం సంప్రదించాల్సి ఉంది. 2-6 నెలల వరకు ఈ విషయంపై ఆర్​బీఐతో చర్చలు జరిపినట్టు కేంద్రం చెబుతోంది. అలాంటప్పుడు సమస్య ఏం ఉంది? నోట్ల రద్దు నిర్ణయం సరైనదే," అని.. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అయితే.. ధర్మాసనంలోని జస్టిస్​ బీవీ నాగరత్న మాత్రం కేంద్రం నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. నోట్ల రద్దు అనేది.. ప్రభుత్వ నిర్ణయంతో కాకుండా.. పార్లమెంట్​ ద్వారా చేపట్టి ఉండాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

2016 నవంబర్​లో రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లను రద్దు చేసింది కేంద్రం. నాడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా రాత్రికి రాత్రే.. రూ. 10లక్షల కోట్ల సంపద సర్క్యులేషన్​ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలయ్యాయి. నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకునే అర్హత ప్రభుత్వానికి లేదని, అందుకే దానిని కొట్టివేయాలని పిటిషనర్లు వాదించారు. నోట్ల రద్దు గడిచిపోయిన అంశం అని, ఫలితంగా.. ఉపశమనం కలిగించేందుకు వీలు లేని అంశాలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కేంద్రం వ్యాఖ్యానించింది. ఇలా చేస్తే కాలాన్ని వెనక్కి తిప్పినట్టే అవుతుందని పేర్కొంది. దేశంలో పేరుకుపోయిన నల్ల ధనం, ఫేక్​ మనీ, ఉగ్రవాదం కోసం వినియోగిస్తున్న నిధులు, పన్ను ఎగవేతతో దాచుకున్న సొమ్ము తుడిచిపెట్టుకోపాయయని వ్యాఖ్యానించింది.

Demonetisation judgement : 58 పిటిషన్లపై గత కొంతకాలంగా విచారణ జరుపుతోంది జస్టిస్​ ఎస్​ఏ నాజీర్​ నేతృత్వంలోని ధర్మాసనం. శీతాకాల సెలవులకు ముందు తీర్పును రిజర్వ్​లో పెట్టింది. తాజాగా తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనంలో.. జస్టిస్​ ఏఎస్​నాజీర్​, జస్టిస్​ నాగరత్నతో పాటు జస్టిస్​ బీఆర్​ గవాయ్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్న, జస్టిస్​ వీ రామసుబ్రమణ్యం కూడా ఉన్నారు.

తదుపరి వ్యాసం