Crime news : చెత్త ఏరుకునే మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన మైనర్లు!
29 December 2023, 11:16 IST
Rajasthan crime news : రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో చెత్త ఎరుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న మహిళపై ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
చెత్త ఏరుకునే మహిళను కిడ్నాప్ చేసి, రేప్ చేసిన మైనర్లు!
Rajasthan crime news : రాజస్థాన్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చెత్త ఏరుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న ఓ మహిళను.. ఇద్దరు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందుతులు.. 9వ తరగితి, 10వ తరగతి చదువుకుంటున్న మైనర్లు కావడం గమనార్హం!
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్కు చెందిన 26ఏళ్ల మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి రాజస్థాన్లోని ఝలావర్ ప్రాంతంలోని ఓ గుడిసెలో నివాసముంటోంది. ఆమెపై ఇద్దరు మైనర్ల కన్నుపడింది. ఆమెను ట్రాప్ చేసేందుకు ప్లాన్ వేశారు.
ఈ క్రమంలోనే.. బుధవారం ఓ వాహనం తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లారు. బలవంతంగా ఆమెను బైక్ మీద ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం.. మహిళను రాలయత అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడే, ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర నొప్పితో ఆ మహిళ స్పృహ కోల్పోయింది.
Rag picker raped in Rajasthan : రేప్ చేసిన తర్వాత.. మైనర్లు ఆ మహిళను సమీపంలోని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. కొంతసేపటికి.. అటువైపు వెళుతున్న ఓ వ్యక్తి.. స్పృహ కోల్పోయి పడి ఉన్న మహిళను చూశాడు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అదే సమయంలో.. మహిళ గురించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ.. గంట తర్వాత స్పృహలోకి వచ్చింది. అదే సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. అసలేం జరిగిందని ఆమెను ప్రశ్నించారు. జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు మహిళ ఫిర్యాదు చేసింది.
మహిళ స్టేట్మెంట్ ఆధారంగా కిడ్నాప్, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్తో పాటు స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించిన అనంతరం నిందితులను పట్టుకున్నారు. వారి వయస్సు చూసి పోలీసులే షాక్ అయ్యారు. నిందితుల్లో ఒకరు 9వ తరగతి చదువుకుంటున్నాడు. మరో నిందితుడు 10వ తరగతి చదువుకుంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు.
Crime news latest : చెత్త ఏరుకునే మహిళను కిడ్నాప్ చేసి, అనంతర గ్యాంగ్ రేప్నకు పాల్పడిన ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేసి, విచారించినట్టు పోలీసులు వెల్లడించారు.