తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Man Defecates In Air India : విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

Man defecates in Air India : విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

Sharath Chitturi HT Telugu

27 June 2023, 7:13 IST

  • Man defecates in Air India : ముంబై- దిల్లీ ఎయిర్​ ఇండియాలో ప్రయాణించిన ఓ వ్యక్తి.. విమానం మధ్యలో మలవిసర్జన చేశాడు. ఈ ఘటన ఈ నెల 24న జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.

విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​
విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​ (HT_PRINT)

విమానం మధ్యలో మలవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్​

Man defecates in Air India : ఎయిర్​ ఇండియా విమానం ఫ్లోర్​పై ఓ వ్యక్తి మలవిసర్జన, మూత్రవిసర్జన చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 24న ఏఐసీ 866 విమానం ముంబై నుంచి దిల్లీ వెళుతుండగా ​ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

ఇదీ జరిగింది..

పోలీసులు నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ ప్రకారం.. నిందితుడి పేరు రామ్​ సింగ్​. సీట్​ నెంబర్​ 17ఎఫ్​లో కూర్చున్న రామ్​ సింగ్​.. విమానం గాలిలో ఎగిరిన తర్వాత 9 రోలో మలవిసర్జనతో పాటు మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటనలో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

రామ్​ సింగ్​ ప్రవర్తనను గమనించిన ఎయిర్​ ఇండియా సిబ్బంది.. అతనికి మాటలతో వార్నింగ్​ ఇచ్చింది. అనంతరం తోటి ప్రయాణికులకు దూరంగా అతడిని కూర్చోబెట్టింది.

మరోవైపు.. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పైలట్​.. సంస్థకు వెంటనే పూర్తి వివరాలను అందించాడు. విమానాశ్రయానికి కూడా సమాచారం అందించాడు. ల్యాండింగ్​ జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తిపై చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశాడు.

రామ్​ సింగ్​పై ఐపీసీ సెక్షన్​ 294, 510 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

నవంబర్​లో ఇలా..

విమానాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి. 2022 నవంబర్​ 26న.. ఎయిర్​ ఇండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మద్యం మత్తులో అతను ఈ విధంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై సరిగ్గా స్పందించలేదని ఎయిర్​ ఇండియాపైనా ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత.. పారిస్​ - దిల్లీ ఎయిర్​ ఇండియా విమానంలో ఓ వ్యక్తి, తోటి ప్రయాణికురాలి బ్లాంకెట్​పై మూత్ర విసర్జన చేశాడు.

తదుపరి వ్యాసం