జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2: రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం
01 February 2024, 14:49 IST
- JEE Mains Exam 2024 Session 2: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ 2024 ఫిబ్రవరి 2న ప్రారంభం కానుంది. దరఖాస్తు ప్రక్రియ ఇక్కడ తెలుసుకోండి.
JEE Mains Exam 2024 Session 2: రిజిస్ట్రేషన్ ప్రక్రియ రేపటి నుంచే..
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫిబ్రవరి 2, 2024 న ప్రారంభించనుంది. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 2కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2 మార్చి 2024. దరఖాస్తు ఫీజును చెల్లించడానికి గడువు మార్చి 2 వరకు ఉంది. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ 2024 మార్చి మూడో వారంలో అందుబాటులో ఉంటుందని, పరీక్ష తేదీకి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను 2024 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహిస్తారు. ఫలితాలను 2024 ఏప్రిల్ 25న ప్రకటిస్తారు.
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 దరఖాస్తు
జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ అనుసరించాలి.
- ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెషన్ 2 లింక్పై క్లిక్ చేయండి.
- ఇక రిజిస్టర్ చేసుకోండి. ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫారమ్ నింపి ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరుచుకోండి.
రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇకపై సెషన్ 2కు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అభ్యర్థులు సెషన్ 2కు దరఖాస్తు చేయాలనుకుంటే రేపటి నుంచి లాగిన్ అయి సెషన్ 2 పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.