తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime | వదినతో అక్రమ సంబంధం.. అడ్డొచ్చిన భార్యను చంపేసి..

Crime | వదినతో అక్రమ సంబంధం.. అడ్డొచ్చిన భార్యను చంపేసి..

HT Telugu Desk HT Telugu

28 March 2022, 15:16 IST

    • అన్న భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ వ్యక్తి. అంతా బాగానే ఉన్న వేళ.. ఆ విషయం అతని భార్యకు తెలిసిపోయింది. ఆమెను వదిలించుకోవాలని వదినతో కలిసి ప్రణాళికలు రచించాడు. భార్యను చంపేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ ఘటన హరియాణాలో జరిగింది.
వదినతో ప్రేమాయణం.. అడ్డొచ్చిన భార్యను చంపి…
వదినతో ప్రేమాయణం.. అడ్డొచ్చిన భార్యను చంపి… (Hindustantimes telugu)

వదినతో ప్రేమాయణం.. అడ్డొచ్చిన భార్యను చంపి…

Husband kills wife | హరియాణాలోని సోనిపట్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత వదినతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలిసిపోయింది. చివరికి.. వదినతో కలిసి భార్యను చంపేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..

జానీ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం మంజు అనే మహిళతో వివాహమైంది. అయితే.. జానీకి తన అన్న భార్య మీనాకు మధ్య అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న మంజు.. వారి వ్యవహారాన్ని వ్యతిరేకించింది. చాలాసార్లు వారి మధ్య గొడవలు కూడా జరిగాయి.

మంజును తప్పించాలని జానీ, అతని వదిన భావించారు. ఓ ప్రణాళిక రచించారు. ఇంకో ఇద్దరి సాయంతో మంజును చంపేశారు. ఆ తర్వాత దానిని హత్యగా కాకుండా.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.

మంజు మృతదేహం.. సోనిపట్​లోని సెక్టర్​ 4 హాకీ గ్రౌండ్​ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత అది రోడ్డు ప్రమాదంగానే భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ నివేదికలో షాకింగ్​ విషయాలు బయటపడ్డాయి. మహిళపై పదునైన ఆయుధాలతో దాడి జరిగినట్టు నిర్ధరణకు వచ్చారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జానీ, అతని వదినను విచారించారు. అప్పుడే జరిగింది పోలీసులకు ఆ ఇద్దరు వివరిచారు. తమ బంధానికి అడ్డుతగులుతోందనే కారణంతోనే మంజును చంపేసినట్టు ఒప్పుకున్నారు.

పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్​ చేశారు. వారిని కోర్టు ఎదుట హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో ఇద్దరిని పట్టుకునేందుకు కృషి చేస్తున్నారు.

భార్యను 20సార్లు కత్తితో పొడిచి..

Man stabs wife to death | దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ముంబై నడిరోడ్డు మీద దారుణ ఘటన జరిగింది. పట్టపగలు.. భార్యను ఓ వ్యక్తి.. 20సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.

మహమ్మద్​ ఇర్ఫాన్​ చిత్వాలికి షాహీన్​ అనే మహిళతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఏడాది కాలంగా దంపతుల మధ్య బంధం సరిగ్గా లేదు. ప్రతి చిన్న విషయంపై వారిద్దరు గొడవపడుతూ ఉండేవాళ్లు. ఈ కారణంగా.. తిట్వాలాలోని తల్లిదండ్రుల ఇంటి వద్ద నివాసముంటున్నాడు ఇర్ఫాన్​. షాహీన్​.. తన పిల్లలతో కలిసి కొలాబాలోని శివ్​ శక్తి నగర్​లో జీవిస్తోంది.

శనివారం ఉదయం 10:30గంటలకు కఫ్ పరేడ్ ప్రాంతంలోని బద్వార్​ పార్క్​కు సమీపంలో దంపతులు కలుసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత.. సడెన్​గా జేబులో నుంచి కత్తి బయటకు తీశాడు ఇర్ఫాన్​. వెంటనే షాహీన్​ను కత్తితో పలుమార్లు పొడిచాడు.

స్థానికులు ఘటనాస్థలం వద్ద గుమిగూడారు. పోలీసులకు సమాచారం అందించారు. చివరికి బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ మార్గం మధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

అదే సమయానికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. కత్తిని స్వాధీనం చేసుకుని అతడిని అరెస్టు చేశారు. విచారణ కోసం నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం