Gold rate today | స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేటి లెక్కలివే..
09 May 2022, 18:52 IST
Gold rate today | దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం పసిడి ధర పెరిగింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..
Gold rate today | దేశంలో బంగారం ధర.. సోమవారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ. 43 తగ్గి.. రూ. 51,227కు చేరింది. క్రితం రోజున.. ఇదే 10గ్రాముల బంగారం.. రూ. 51,270 వద్ద ఉండేది.
కానీ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్.. 1,871 డాలర్లుగా ఉంది.
"సోమవారం ఔన్స్ గోల్డ్.. 0.35శాతం పెరిగి.. 1,871 డాలర్లకు చేరింది. డాలర్ వృద్ధి చెందడం, యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడం ఇందుకు కారణం," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్కు చెందిన సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ వివరించారు.
వెండి ధర ఇలా..
Silver rate today | దేశీయ మార్కెట్లో బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 62 తగ్గి, రూ. 62,393కు చేరింది. క్రితం రోజున కేజీ వెండి ధర రూ. 62,455గా ఉంది.
టాపిక్