Rakul Preet Singh Marriage: రకుల్ ప్రీత్ సింగ్ సంగీత్ ఫంక్షన్ థీమ్ ఇదే!
20 February 2024, 17:26 IST
- Rakul Preet Singh Marriage: రకుల్ ప్రీత్ సింగ్ వివాహం మరొక్క రోజులో జరగనుంది. ఈ తరుణంలో పెళ్లికి ముందు సంగీత్ కార్యక్రమం జరగనుంది. ఈ సంగీత్ గురించిన వివరాలు బయటికి వచ్చాయి.
రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ
Rakul Preet Singh Wedding: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం సమయం సమీపిస్తోంది. ఇంకొక్క రోజులో ఆమె వివాహం జరగనుంది. తన బాయ్ఫ్రెండ్, నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని రకుల్ ప్రీత్ సింగ్ రేపు (ఫిబ్రవరి 21) మనువాడనున్నారు. గోవాలో ఈ వివాహ వేడుకగా గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే రకుల్, జాకీ గోవాకు వెళ్లగా.. పెళ్లికి ముందు జరిగే వేడుకలు సాగుతున్నాయి. నేటి (ఫిబ్రవరి 20) రాత్రి సంగీత్ జరగనుంది.
సంగీత్ థీమ్ ఇదే
రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ సంగీత్ వేడుక నేటి రాత్రి 8 గంటలకు మొదలుకానుందని తెలుస్తోంది. ఈ ఫంక్షన్లో బాలీవుడ్ పాటలే మెయిన్ థీమ్గా ఉండనున్నాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ వెల్లడించింది. ఫుల్ జోష్లో ఉండే బాలీవుడ్ పాటలు ఈ ఫంక్షన్లో ప్లే చేస్తారని తెలిపింది.
సంగీత్కు హాజరయ్యే అతిథులకు డ్రెస్ కోడ్ కూడా ఉందట. అందరూ తళతళ మెరిసే షిమ్మెరీ ఔట్ఫిట్ ధరించి రావాలని కూడా డిసైడ్ అయ్యారని టాక్. సంగీత్ ఫంక్షన్లో కొందరు సెలెబ్రెటీల స్పెషల్ పర్ఫార్మెన్సులు, పంజాబీ వెడ్డింగ్ మ్యాషప్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
పెళ్లికి బయలుదేరిన సెలెబ్రిటీలు
గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్లో రకుల్ ప్రీత్ సింగ్ - జాకీ భగ్నానీ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు, సన్నిహితంగా ఉండే కొందరు బాలీవుడ్ సెలెబ్రిటీల మధ్య ఈ వివాహం జరగనుంది. రకుల్ వివాహానికి హాజరయ్యేందుకు నేడు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, అతడి భార్య తహిరా కష్యప్ గోవాకు చేరుకున్నారు. సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా గోవాకు బయలుదేరారు. డేవిడ్ ధావన్ కూడా గోవాకు వెళ్లారు. మరికొందరు సెలెబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారు.
రకుల్ - జాకీ తమ వివాహాన్ని ఎకో ఫ్రెండ్లీగా నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. వివాహం సందర్భంగా ఎలాంటి టపాసులు కాల్చకూడదని డిసైడ్ అయ్యారు. అలాగే, పెళ్లి తర్వాత మొక్కలు నాటనున్నారని సమాచారం. పేపర్ వేస్ట్ తగ్గించేందుకు వివాహ ఆహ్వాన పత్రికలను కూడా ఎక్కువగా డిజిటల్ రూపంలోనే పంపారట. గోవాకు వెళ్లే ముందు వారిద్దరూ ముంబైలోని సిద్దివినాయక ఆలయంలో పెళ్లి పత్రికతో ప్రత్యేక పూజలు జరిపారు. రెండు రోజుల క్రితమే రకుల్ - జాకీ గోవా వెళ్లారు. గోవా ఐటీసీ గ్రాండ్ రిసార్ట్లో పెళ్లికి గ్రాండ్గా ఏర్పాట్లు జరిగాయి.
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ ప్రేమ మూడేళ్ల కిందట మొదలైంది. ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయమైంది. ఆ తర్వాత కొంతకాలానికే ప్రేమించుకున్నారు. 2021లో రకుల్ పుట్టిన రోజున ఈ ప్రేమ బంధం అధికారికంగా బయటికి వచ్చింది. వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు రకుల్, జాకీ. మొత్తంగా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. కొన్ని గంటల్లో వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 20న ఈ ప్రేమ జంట దంపతులు కానున్నారు.