Virat Kohli: మహమ్మద్ కైఫ్ పోస్టుకు లైక్ కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇంకా అసంతృప్తితోనే!
22 April 2024, 20:12 IST
- Virat Kohli - KKR vs RCB: భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడు. కేకేఆర్తో మ్యాచ్లో తనను ఔట్గా ప్రకటించడంపై మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
Virat Kohli: విరాట్ కోహ్లీపై జరిమానా - మహమ్మద్ కైఫ్ పోస్టుకు లైక్ కొట్టిన ఆర్సీబీ స్టార్
Virat Kohli: ఐపీఎల్ 2024 సీజన్లో వివాదం రేగింది. కోల్కతా నైట్రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఔట్ అయిన తీరు దుమారాన్ని రేపుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణా వేసిన హైఫుల్ టాస్ బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు కోహ్లీ. అయితే, ఆ ఫుల్ టాస్ చాలా హైట్తో వచ్చిందని నోబాల్ ఇవ్వాలని విరాట్ రివ్యూ తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ అది నోబాల్ కాదని, కోహ్లీ ఔట్ అని నిర్ణయం ప్రకటించాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లపై విరాట్ కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఫీల్డ్ అంపైర్లతో విరాట్ కోహ్లీ వాదన చేశాడు. అదెలా నోబాల్ కాదని ప్రశ్నించాడు. విరాట్ (18 పరుగులు) ఆ తర్వాత కోపంగా పెవిలియన్కు నడుచుకుంటూ వెళ్లాడు. బౌండరీ లైన్ దాటాక కోపంగా బ్యాట్తో చెత్త కుండీని కొట్టాడు.
అంపైరింగ్పై కైఫ్ ఫైర్.. కోహ్లీ లైక్
విరాట్ కోహ్లీని ఔట్గా ప్రకటించడం సరికాదని, అది నోబాల్ అని భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ ఇన్స్టాగ్రామ్లో నేడు పోస్ట్ చేశారు. పూర్ అంపైరింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోనీకి ఇటీవల బ్యాట్ కింద వెళ్లిన బంతిని కూడా వైడ్గా ఇచ్చారని కైఫ్ పేర్కొన్నాడు. “ఆడేందుకు వీలుకాని విధంగా వచ్చిన బీమర్ (ఫుల్ టాస్)కు కోహ్లీ ఔటయ్యాడు. ధోనీ బ్యాట్ కింద వెళ్లిన ఓ బంతిని వైడ్గా ఇచ్చారు. కెమెరాలు, రిప్లేలు, టెక్నాలజీలు ఉన్నా ఇంకా పొరపాట్లు జరుగుతున్నాయి. నాసిరకమైన అంపైరింగ్” అని కైఫ్ రాసుకొచ్చారు.
కైఫ్ చేసిన ఈ పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టాడు. అది ఔట్ కాదనే తాను ఇంకా ఫీల్ అవుతున్నట్టు దీంతో ఈ ఆర్సీబీ స్టార్ మరోసారి స్పష్టం చేశాడు. అసంతృప్తిని ఈ విధంగా మళ్లీ వ్యక్తం చేశాడు విరాట్ కోహ్లీ.
సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై రచ్చ సాగుతోంది. అది నోబాలే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంపైరింగ్పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, కోహ్లీకి జరిమానా వేయడంపై కూడా అసంతృప్తి తెలుపుతున్నారు.
50 శాతం ఫైన్
కోల్కతాతో మ్యాచ్లో కోపంతో అంపైర్లతో వాదించిన ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు మ్యాచ్ రిఫరీ. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా అతడికి నేడు (ఏప్రిల్ 21) ఈ జరిమానా వేశారు. ఈ విషయాన్ని నేడు వెల్లడించారు.
కోహ్లీ రివ్యూకు వెళ్లినా.. హాక్ఐ బాల్ ట్రాకింగ్ టెక్నాలజీ మాత్రం ఆ బంతికి నోబాల్ కాదని తేల్చింది. ఆ హైఫుల్ టాస్ను ఆడినప్పుడు కోహ్లీ క్రీజు బయట ఉన్నాడు. దీంతో బంతి డిప్ అయి.. సాధారణ పోజిషన్ ఉండి ఉంటే నడుము కంటే కిందే ఉండిఉండేదని నిర్ధారించిన థర్డ్ అంపైర్ దాన్ని నోబాల్ ఇవ్వలేదు. దీంతో విరాట్ కోహ్లీ ఆగ్రహించాడు.
ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్లో కోల్కతా చేతిలో ఒక్క పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది.
ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఏడు మ్యాచ్ల్లో ఓడి ప్లేఆఫ్స్ ఆశలను కష్టతరం చేసుకుంది. ఇక మిగిలిన ఆరు లీగ్ మ్యాచ్లను గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది.
టాపిక్