తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Road Accident In Us : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి

Road Accident In US : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి

HT Telugu Desk HT Telugu

27 September 2022, 20:36 IST

    • Road Accident News : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృతి చెందారు. దసరా సంబరాలను కలిసి జరుపుకొందామనుకున్న కుటుంబంలో విషాదం నెలకొంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలోని వాలర్‌ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హస్టన్‌లో నివసిస్తున్న తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ ఆంధ్ర (తానా) డైరెక్టర్స్‌ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ తన భార్య, కుమార్తెలిద్దరినీ కోల్పోయారు. డాక్టర్ శ్రీనివాస్ తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి తన పెద్ద కుమార్తెను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లారు. ఇదే సమయంలో ప్రమాదం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

AP EAPCET 2024 Updates : ఐఎండీ రెయిన్ అలర్ట్... ఏపీ ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు కీలక అప్డేట్

వారు తిరిగి వస్తుండగా పికప్ ట్రక్కు కారును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తెలలో ఒకరిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె కూడా మృతి చెందింది. శ్రీనివాస్ హ్యూస్టన్‌లో నివాసం ఉంటుండగా, అతని భార్య వాణి ఐటీ ఉద్యోగి. పెద్ద కూతురు మెడిసిన్‌ చదువుతోంది. చిన్న కూతురు 11వ తరగతి చదువుతోంది.

ఈ ప్రమాదంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై తానా సభ్యులు విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రీనివాస్ కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జన్మించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. 1995లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్‌గా స్థిరపడ్డారు. 2017 నుండి, కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తానా బోర్డు సభ్యులలో ఒకరిగా పనిచేస్తున్నారు.

తదుపరి వ్యాసం