Road Accident In US : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి
27 September 2022, 20:36 IST
- Road Accident News : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మృతి చెందారు. దసరా సంబరాలను కలిసి జరుపుకొందామనుకున్న కుటుంబంలో విషాదం నెలకొంది.
ప్రతీకాత్మక చిత్రం
అమెరికాలోని వాలర్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హస్టన్లో నివసిస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆంధ్ర (తానా) డైరెక్టర్స్ బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తన భార్య, కుమార్తెలిద్దరినీ కోల్పోయారు. డాక్టర్ శ్రీనివాస్ తన భార్య, చిన్న కుమార్తెతో కలిసి తన పెద్ద కుమార్తెను దసరాకు ఇంటికి తీసుకురావడానికి వెళ్లారు. ఇదే సమయంలో ప్రమాదం జరిగింది.
వారు తిరిగి వస్తుండగా పికప్ ట్రక్కు కారును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కుమార్తెలలో ఒకరిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె కూడా మృతి చెందింది. శ్రీనివాస్ హ్యూస్టన్లో నివాసం ఉంటుండగా, అతని భార్య వాణి ఐటీ ఉద్యోగి. పెద్ద కూతురు మెడిసిన్ చదువుతోంది. చిన్న కూతురు 11వ తరగతి చదువుతోంది.
ఈ ప్రమాదంతో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై తానా సభ్యులు విచారం వ్యక్తం చేశారు. డాక్టర్ శ్రీనివాస్ కృష్ణా జిల్లా కురుమద్దాలిలో జన్మించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. 1995లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్గా స్థిరపడ్డారు. 2017 నుండి, కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ తానా బోర్డు సభ్యులలో ఒకరిగా పనిచేస్తున్నారు.