తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ

Telangana Tourism : బీచ్ పల్లి టెంపుల్, జోగులాంబ శక్తి పీఠం దర్శనం - రూ. 1500కే స్పెషల్ టూర్ ప్యాకేజీ

09 May 2024, 19:04 IST

    • Alampur Beechupalli Tour Package : దక్షిణ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయాలను చూసేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. వీకెండ్ లో ఈ టూర్ ను ఆపరేట్  చేస్తున్నారు. ఆ వివరాలను ఇక్కడ చూడండి….
తెలంగాణ టూరిజం అలంపూర్ టూర్ ప్యాకేజీ
తెలంగాణ టూరిజం అలంపూర్ టూర్ ప్యాకేజీ (@tstdcofficial Twitter)

తెలంగాణ టూరిజం అలంపూర్ టూర్ ప్యాకేజీ

Telangana Tourism Packages : అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయంతో పాటు బీచ్ పల్లిలోని ఆంజనేయస్వామి ఆలయానికి దర్శించుకునేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. శని, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, జూన్ 3 వరకు రిమాండ్ పొడిగింపు

Hyderabad Fish Prasadam : జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు

Do Dham IRCTC Tour Package : కేదార్ నాథ్, బద్రీనాథ్ దో ధామ్ యాత్ర- 7 రోజుల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే!

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

అలంపూర్, బీచ్ పల్లి టూర్ షెడ్యూల్ :

  • HYDERABAD-BEECHPALLI-ALAMPUR TEMPLES & BACK పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • ప్రతి శనివారం, ఆదివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • హైదరాబాద్ నుంచి నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
  • టికెట్ ధరలు - పెద్దలకు 1500, పిల్లలకు రూ. 1200గా నిర్ణయించారు.
  • ఒకే ఒక్క రోజులోనే ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది.
  • ఉదయం 11. 30 గంటలకు బీచ్ పల్లికి చేరుకుంటారు. కృష్ణా నది పక్కన ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు.కృష్ణానదిపై వంతెన దాటుతున్నప్పుడు ప్రకృతి అందాలు ఎంతో అనుభూతిని కలిగిస్తాయి.
  • మధ్యాహ్నం 1 గంటలకు శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. హారిత హోటల్ లో లంచ్ ఉంటుంది. సాయంత్రం ఇక్కడే స్నాక్స్ ఇస్తారు.
  • 04.30 PM - అలంపూర్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.
  • 08.00 PM - హైదరాబాద్ కు చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

తిరుమల టూర్ ప్యాకేజీ

Telangana Tourism Hyderabad Tirumala Tour : తిరుమల శ్రీవారి భక్తుల కోసం మంచి ప్యాకేజీ వచ్చేసింది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ టూర్ ప్యాకేజీ పూర్తి అవుతుంది. దీన్ని తెలంగాణ టూరిజం ఆపరేట్ చేస్తుంది. బస్సులోనే వెళ్లాల్సి ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది.

  • TIRUPATI - TIRUMALA TOUR పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది.
  • కేవలం ఒకే ఒక్క రోజులోనే తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
  • Day 1 - సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయల్దేరుతుంది. (సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9848540374)
  • Day 2 - ఉదయం 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. ఫ్రెషప్ అయిన తర్వాత స్థానంకంగా ఉండే ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు.
  • తిరుపతిలో ఫ్రెషప్ అవుతారు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది.
  • Day 3 - ఉదయం 7 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
  •  

తదుపరి వ్యాసం