తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Special Trains: తిరుపతికి స్పెషల్ ట్రైన్స్, వయా వికారాబాద్ - వివరాలివే

Tirupati Special Trains: తిరుపతికి స్పెషల్ ట్రైన్స్, వయా వికారాబాద్ - వివరాలివే

HT Telugu Desk HT Telugu

07 September 2022, 12:55 IST

    • Special Trains to Tirupati: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది.
హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ తిరుపతి ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరికొన్నింటిని ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ స్పెషల్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. సెప్టెంబర్‌లో తిరుపతి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో హైదరాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇవి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వన్ వే స్పెషల్ ట్రైన్స్ మాత్రమే.

హైదరాబాద్ నుంచి తిరుపతికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సెప్టెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

వెళ్లే రూట్..

ఈ ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సులేహల్లి, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

ఈ రైలులో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లకు ఇప్పటికే రిజర్వేషన్ ప్రారంభమైంది. తిరుపతి వెళ్లాలనుకునేవారు టికెట్ రిజర్వేషన్ చేయొచ్చు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు తిరుపతి-బిలాస్‌పూర్ మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించడంతో పాటు రీషెడ్యూల్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి నుంచి బిలాస్‌పూర్ మధ్య అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 8, 11 తేదీల్లో ఈ రైలు తిత్లాగఢ్, సంబాల్‌పూర్, ఝర్సుగూడ, బిలాస్‌పూర్ రూట్‌లో ప్రయాణిస్తుంది. బిలాస్‌పూర్ నుంచి తిరుపతి రూట్‌లో అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 10, 13 తేదీల్లో ఈ రైలు బిలాస్‌పూర్, సంబాల్‌పూర్, ఝర్సుగూడ, తిత్లాగఢ్ రూట్‌లో ప్రయాణిస్తుంది.

తదుపరి వ్యాసం