SCR: ప్రయాణికులకు అలర్ట్... తిరుపతికి స్పెషల్ ట్రైన్స్ - వెళ్లే రూట్స్ ఇవే
tirupati special trains: తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లను నడపనుంది.
tirupati special trains from hyderabad: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ృ స్పెషల్ ట్రైన్స్ ఆపరేట్ చేస్తోంది.
ఈ తేదీల్లోనే...
kachiguda - tirupati trains: రైలు నెంబర్ 07297 కాచిగూడ నుంచి తిరుపతికి జూలై 13, జూలై 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ బుధవారం రాత్రి 10.20 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
ఈ ట్రైన్ షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది.
జూలై 14, 21 తేదీల్లో
tirupati - kachiguda special trains: రైలు నెంబర్ 07298 తిరుపతి నుంచి కాచిగూడకు జూలై 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైలు రేణిగుంట, రాజంపేట్, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ఢోన్, కర్నూల్ సిటీ, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, రైల్వే స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది.
ఇవాళ, రేపు కూడా….
రైలు నంబర్ 07569 హైదరాబాద్ నుంచి తిరుపతికి జూలై 8న ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుపతి చేరుతుంది. ఇది సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 07570 తిరుపతి నుంచి హైదరాబాద్కు జూలై 9న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు శనివారం రాత్రి 9 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట, గూడూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
ఈ ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్ కొనసాగుతోంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో రైలు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక రైళ్లల్లో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైలు సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో కోరింది.
సంబంధిత కథనం