New train time table : అక్టోబర్ 1 నుంచి రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు..!
New train time table : అక్టోబర్ 1 నుంచి రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది!
New train time table : రైల్వే ప్రయాణికులకు అలర్ట్..! త్వరలోనే రైళ్ల టైమ్ టేబుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైళ్లకు సంబంధించిన కొత్త టైమ్ టేబుల్.. అక్టోబర్ 1న అమల్లోకి వేచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
రైళ్ల కొత్త టైమ్ టేబుల్కి సంబంధించి.. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తక్కువ ప్యాసింజర్లు ఉన్న స్టేషన్లపై భారతీయ రైల్వే సమీక్ష నిర్వహించిందని పేర్కొన్నాయి. ఆయా రైల్వే స్టేషన్లలో స్టాప్లను తొలగించేందుకు యోచిస్తున్నట్టు చెప్పాయి.
ఇదే జరిగితే.. తక్కువ స్టేషన్ల వల్ల.. ప్రయాణ సమయం తగ్గుతుంది. మరింత వేగంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే రైళ్ల కొత్త టైమ్ టేబుల్ను భారతీయ రైల్వే రూపొందిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా.. సుదీర్ఘ ప్రయాణాలు చేసే రైళ్లకు ఇది వర్తిస్తుందని తెలుస్తోంది.
Change in train timings : చివరిసారిగా 2021లో రైళ్ల టైమ్ టేబుల్ను మార్చింది భారతీయ రైల్వే. ఆ టైమ్ టేబుల్ కూడా అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో స్పెషల్ ట్రైన్లు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు స్పెషల్ ట్రైన్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇక రానున్న రోజుల్లో.. రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు కూడా పూర్తవుతాయి. మరిన్ని రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తాయి. వాటిని అమల్లోకి తీసుకురావాలని రైల్వే యోచిస్తోంది.
ఈ కారణాలతో.. రైళ్ల కొత్త టైమ్ టేబుల్ను అమలు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే భావిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి రావొచ్చని తెలుస్తోంది.
కాగా.. ఈ వ్యవహారంపై భారతీయ రైల్వే ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
సంబంధిత కథనం