Telangana TET Exam : టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ నోటిఫికేషన్ల కోసం ఇక నుంచి ఎదురుచూడకుండా...ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఏడాదిలో 2 సార్లు టెట్ ను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ నెలతో పాటు డిసెంబర్ మాసంలో ఈ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు ఎన్నిసార్లైనా టెట్ రాసుకునే అవకాశం కూడా కల్పించారు. టెట్ మార్కుల ఆధారంగా... డీఎస్సీలో వెయిటేజీని ఇస్తారు.
గతంలో టెట్ పరీక్షను ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించారు. కానీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలను ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా... రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏడాదిలో రెండుసార్లు టెట్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.
టెట్ పేపర్-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు డీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
టెట్ పేపర్-2కు డిగ్రీ అర్హతతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు పొంది ఉండాలి.
టెట్(పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది.
పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.
శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు): శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహన