Telangana News Live December 20, 2024: Jagtial Crime News : డమ్మీ తుపాకులతో బెదిరించి చోరీ - ఆరుగురు కేటుగాళ్లు అరెస్ట్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 20 Dec 202404:23 PM IST
- జగిత్యాల జిల్లా బీర్ పూర్ లో గన్నులతో బెదిరించి చోరీకి పాల్పడ్డ కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు సభ్యులతో కూడిన ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, 2 డమ్మీ తుపాకులు, పది వేల నగదు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Fri, 20 Dec 202403:05 PM IST
- ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఏసీబీ కేసు నమోదు ఆధారంగా.. ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లను పేర్కొంది.
Fri, 20 Dec 202412:08 PM IST
- TG High Court On Formula E race Case : ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. డిసెంబర్ 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని ఏసీబీని ఆదేశించింది.
Fri, 20 Dec 202411:53 AM IST
- ఈ ఏడాదిలో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉండగా.. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది.
Fri, 20 Dec 202411:11 AM IST
- Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సభలో ఫార్ములా ఈ కార్ రేసు ప్రకంపనలు సృష్టించింది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. స్పీకర్ పోడియం వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు.
Fri, 20 Dec 202410:53 AM IST
- Telangana Bhu Bharati Bill 2024 : ‘తెలంగాణ భూ భారతి - 2024 బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఉన్న ధరణి స్థానంలో… ఇకపై భూ భారతి రానుంది. కొత్త చట్టంలో కీలక అంశాలు ఉన్నాయి.
Fri, 20 Dec 202407:42 AM IST
- ED Focus on KTR : మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపింది. ఈ వ్యవహారంపై ఈడీ ఫోకస్ పెట్టింది. తాజాగా.. తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాసినట్టు తెలిసింది. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీని ఈడీ కోరింది.
Fri, 20 Dec 202407:04 AM IST
- ACB Case on KTR : సీఎంకు సమాచారం లోపం ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎంను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారన్న కేటీఆర్.. తనపై కేసు నిలవదని ధీమా వ్యక్తం చేశారు. తాము లీగల్గా ముందుకు వెళ్తామని.. లంచ్ మోషన్ పిటిషన్ వేశామని చెప్పారు. తనను ఏ కేసులో అరెస్టు చేయాలో సీఎంకు ఆర్థం కావడం లేదన్నారు.
Fri, 20 Dec 202407:03 AM IST
- APGVB Bifurcation: వరంగల్ కేంద్రంగా నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇకపై ఆంధ్రప్రదేశ్కు పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీజీవీబీని విభజించాలని నిర్ణయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్తర్వులకు అనుగుణంగా బ్యాంకు విభజన జరుగుతోంది.
Fri, 20 Dec 202406:20 AM IST
- HYD NTR Statue: హైదరాబాద్లో ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహ నిర్మాణానికి భూమి కేటాయించాలని విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడాన్ని ఉద్యమ జర్నలిస్టులు తప్పు పడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ విగ్రహ నిర్మాణానికి భూమిని కేటాయించాలని విజ్ఞప్తి చేశాయి.
Fri, 20 Dec 202405:46 AM IST
- TG Fancy Numbers : తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు వరంగా మారాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్తుస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిధిలో వీటికి డిమాండ్ ఉంది. 3, 6, 9 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
Fri, 20 Dec 202405:35 AM IST
Hyderabad Book Fair: భాగ్యనగరంలో పుస్తక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 29వ తేదీ వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. తెలంగాణ మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రదర్శన ప్రారంభించారు. సామాజిక స్పృహ, సమాజంలో వస్తున్న మార్పులపై చర్చించేందుకు బుక్ ఫెయిర్ మంచి వేదిక అన్నారు.
Fri, 20 Dec 202404:02 AM IST
- SIT on ORR : తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా గరం గరంగా మారాయి. కేటీఆర్పై ఏసీబీ కేసు.. ఆ వెంటనే ఓఆర్ఆర్ కాంట్రాక్టులో అవకతవకలపై సిట్ ఏర్పాటు నిర్ణయంతో టీజీ పాలిటిక్స్ హీటెక్కాయి. కేటీఆర్ కేసు విషయం పక్కనబెడితే.. అసలు ఓఆర్ఆర్ కాంట్రాక్టులో ఏం జరిగిందో ఓసారి చూద్దాం.
Fri, 20 Dec 202402:43 AM IST
- Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాముల భయం నెలకొంది.నాలుగు మాసాల క్రితం ఇద్దరు విద్యార్థులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోగా తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం కలకలం సృష్టించింది.
Fri, 20 Dec 202401:38 AM IST
- TGSWREIS Admissions: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గురుకుల విద్యాలయ సంస్థల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
Fri, 20 Dec 202412:02 AM IST
- Vemulawada Fraud: వేములవాడలో బ్యాంకు వద్ద వృద్ధుడిని నమ్మించి మోసం చేశాడు యువకుడు. డ్రా చేసిన డబ్బులు లెక్కించి ఇస్తానని చెప్పి చేతివాటం ప్రదర్శించి 7 వేల మాయం చేశాడు. పారిపోయేందుకు యత్నించి అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యాడు.